ETV Bharat / state

నగరాభివృద్ధికి కృషి చేయండి

హైదరాబాద్ మహానగర పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ పిలుపునిచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్​ సాధన అనే అంశంపై బంజారాహిల్స్​లో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

author img

By

Published : Mar 6, 2019, 2:02 PM IST

సదస్సులో ప్రసంగిస్తున్న జీహెచ్​ఎంసీ కమిషనర్

స్వచ్ఛంద సంస్థల సహకారం, పౌర సంస్థల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ సాధన అనే అంశం పై బంజారాహిల్స్​లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ రాములు, జీహెచ్​ఎంసీ కమిషనర్ దాన కిషోర్​ హాజరయ్యారు. స్వచ్ఛ ర్యాంకులతో సంబంధం లేకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పిలుపునిచ్చారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే నగరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నగర వాసులు అభివృద్ధిలో తమ వంతు బాధ్యత కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు.

స్వచ్ఛ హైదరాబాద్​ సాధన అనే అంశంపై సదస్సు

స్వచ్ఛంద సంస్థల సహకారం, పౌర సంస్థల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ సాధన అనే అంశం పై బంజారాహిల్స్​లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ రాములు, జీహెచ్​ఎంసీ కమిషనర్ దాన కిషోర్​ హాజరయ్యారు. స్వచ్ఛ ర్యాంకులతో సంబంధం లేకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పిలుపునిచ్చారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే నగరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నగర వాసులు అభివృద్ధిలో తమ వంతు బాధ్యత కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు.

ఇవీ చదవండి: 'సీడబ్ల్యూసీ సమావేశం 12న'

Date: 05.03.2019 Hyd_tg_49_05_Case on GHMC Supervisor_Ab_C4 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : హెచ్‌హెచ్‌ఎం‌సి లో లైంగిత వేధింపులు మరోసారి  బయటపడుతున్నాయి. తాము పనిచేస్తు అన్నదమ్ములు అనుకుంటు తిరిగే వద్దే కామాంధులు వేధింపులకు గురి చేస్తున్నారు.పారిశ్యుద్ద కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జి‌హెచ్‌ఎం‌సి ఉద్యోగిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ సర్కిల్-లో జి‌హెచ్‌ఎం‌సి జవాన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అలియాస్ మన్సూరాబాద్  శ్రీను(43) అదే సర్కిల్ పరిధిలో తన కింద స్వీపర్ గా ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఓ మహిళను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేదిస్తున్నాడు. అదే విధంగా గత నెల 26 నుండి ఫోన్ లో వేదించసాగాడు అతని వేదింపులు తట్టుకోలేకపోయిన మహిళా మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మహిళా పిర్యాదుతో నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ మహిళా గత 13 ఏళ్లుగా తాను స్పీపర్ గా పనిచేస్తున్నానని గత కొంత కాలంగా జవాన్ ఇబ్బంది పెడుతున్నడని పిర్యాధులో పేర్కొంది. ఇది ఇలా ఉండగా జి‌హెచ్‌ఎం‌సి లో మహిళలను కింది స్థాయి కార్మికులను లైంగికంగా వేదింపులు కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నట్లు, వేదింపులు బరించలేక లోలోపల మదనపడేవారు చాలానే ఉన్నారని  తెలుస్తుంది. రిమాండ్ కు తరలించిన సమయంలో కోర్ట్ లో బెయిల్ రావడంతో మీడియా కు చిక్కకుండా కోర్ట్ ప్రాంగణం నుండి పరరారయ్యాడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.