ETV Bharat / state

చదివేది ఇంజినీరింగ్... చేసేది గంజాయి స్మగ్లింగ్ - Ganjayee JNTUH Engineering Students Arrested in Uppal Hyderabad

ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. కళాశాలలో ఉత్తమ విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతలోనే జల్సాలకు, గంజాయికి ఆలవాటు పడ్డారు. డబ్బుల కోసం తోటి విద్యార్థులకు గంజాయి అమ్ముతూ హైదరాబాద్ ఉప్పల్​లో ఎక్సైజ్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

Ganjayee JNTUH Engineering Students Arrested in Uppal Hyderabad
చదివేది ఇంజినీరింగ్... చేసేది గంజాయి స్మగ్లింగ్
author img

By

Published : Dec 24, 2019, 8:51 PM IST

వరంగల్ జిల్లాకు చెందిన వరుణ్ తేజా, ఖమ్మం జిల్లాకు చెందిన అభిషేక్ జేఎన్‌టీయూహెచ్​లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరికి కళాశాలలో ఉత్తమ విద్యార్థులుగా పేరు ఉంది. కొద్దిరోజుల నుంచి వారిలో భారీ మార్పు వచ్చింది. అందుకు గంజాయికి అలవాటు పడ్డటమే కారణం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కేజీ రూ. 4వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌ శివారులోని కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అందులో కేజీకి రూ.20వేలు చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా వీరు రెండేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. హబ్సిగూడలోని సీసీఎంబీ వద్ద ఓ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్ముతుండగా ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు కేజీల గంజాయి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

చదివేది ఇంజినీరింగ్... చేసేది గంజాయి స్మగ్లింగ్

ఇదీ చూడండి: దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!... ఆమె 6 నెలల గర్భవతి

వరంగల్ జిల్లాకు చెందిన వరుణ్ తేజా, ఖమ్మం జిల్లాకు చెందిన అభిషేక్ జేఎన్‌టీయూహెచ్​లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరికి కళాశాలలో ఉత్తమ విద్యార్థులుగా పేరు ఉంది. కొద్దిరోజుల నుంచి వారిలో భారీ మార్పు వచ్చింది. అందుకు గంజాయికి అలవాటు పడ్డటమే కారణం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కేజీ రూ. 4వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌ శివారులోని కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అందులో కేజీకి రూ.20వేలు చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా వీరు రెండేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. హబ్సిగూడలోని సీసీఎంబీ వద్ద ఓ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్ముతుండగా ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు కేజీల గంజాయి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

చదివేది ఇంజినీరింగ్... చేసేది గంజాయి స్మగ్లింగ్

ఇదీ చూడండి: దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!... ఆమె 6 నెలల గర్భవతి

Intro:HYD_tg_59_24_Ganjayee_Students_Arrest_vo_TS10026
కంట్రిబ్యూటర్‌ : ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( ) ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు..కళాశాలలో ఉత్తమ విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.. అంతలోనే జల్సాలకు, గంజాయికి ఆలవాటు పడ్డారు... డబ్బుల
కోసం తోటి విద్యార్థులకు గంజాయి అమ్ముతు ఎక్సైజ్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు..వరంగల్‌ జిల్లా శ్రీకృష్ణనగర్‌కు చెందిన రవీందర్‌ ప్రైవేటు ఉపాధ్యాయుడు అతని కొడుకు
వరుణ్‌తేజా జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఖమ్మం జిల్లా రాజారాంపల్లికి చెందిన పోచయ్య వ్యవసాయ రైతు అతని కొడుకు అభిషేక్‌ కూడా
జేఎన్‌టీయూలో చదువుతున్నాడు. వీరికి కళాశాలలో ఉత్తమ విద్యార్థులుగా పేరు ఉంది. కొద్ది రోజుల నుంచి వారిలో భారీ మార్పు వచ్చింది. అందుకు గంజాయికి అలవాటు పడ్డం..
డబ్బుల కోసం గంజాయికి ఉన్న డిమాండ్‌ వారిని ఆ వ్యాపారంలో దిపింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కేజీ రూ. 4వేల చోప్పున గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌ శివారులోని
కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అందులో కేజీకి రూ.20వేలు ఆదాయం వస్తుంది. ఇలా వీరు రెండు ఏళ్లగా వ్యాపారం చేస్తున్నారు. హబ్సిగూడలోని సీసీఎంబి వద్ద ఓ ఇంజనీరింగ్‌
కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్ముతుండగా ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.వారి నుంచి రెండు కేజీల గంజాయి, దానికి సంబంధిచిన ఆయిల్‌, ద్విచక్రవాహనం స్వాధీనం
చేసుకున్నట్లు ఇన్ స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.Body:Chary,uppalConclusion:9848599881

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.