తెలంగాణలో గంగపుత్ర కులాన్ని లేకుండా చేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆ సంఘం కన్వీనర్ బిజ్జ లక్ష్మణ్ ఆరోపించారు. తమ కులాన్ని భూస్థాపితం చేసి మరో సామాజిక వర్గానికి మేలు చేసేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఏం చేయాలి..
చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. కులవృత్తిగా చేపలు పడుతున్న గంగపుత్రులు ఏం పని చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ సామాజికవర్గానికి మేలు చేసేందుకు మరొకరిని అణిచివేయడం భావ్యం కాదని విమర్శించారు.
స్పందన లేదు..
కులాల మధ్య మంత్రులు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తలసాని తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గంగపుత్రులకు తలసాని క్షమాపణ చెప్పాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సంఘటితమవుతాం. హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాం. రాజధాన్ని దిగ్భందిస్తాం.
-గంగపుత్ర సంఘం
ఇదీ చూడండి: ప్రొటోకాల్ లొల్లి... భాజాపా, తెరాస బాహాబాహీ