ETV Bharat / state

ఇళ్ల మధ్య చేపల లారీల పార్కింగ్​... ఎక్కడ చూసినా చెత్తా చెదారం

author img

By

Published : May 31, 2020, 5:57 PM IST

Updated : Jun 1, 2020, 5:26 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని గంగపుత్ర కాలనీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. అసలే ప్రజలు కరోనాతో బాధపడుతుంటే... ఇదే సమయంలో గంగపుత్ర కాలనీలోని చేపల లారీల పార్కింగ్​లో ఎక్కడికక్కడ చెత్తా చెదారం నిండి స్థానిక ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.

fish
fish

రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్​గా పేరుగాంచిన ముషీరాబాద్ చేపల లారీల పార్కింగ్​ ఎన్నో సమస్యలకు నిలయంగా మారిపోయింది. లారీల నుంచి చేపలు దించుతుండగా కింద పడిన చేపల వేస్టేజీని పక్కనే ఉన్న చెత్త కుండీలో వేస్తున్నారు. దాని వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ బోర్డు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోయారు.

చేపల మార్కెట్​కు వచ్చీ పోయే వాహనాల వల్ల పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో పార్కింగ్ మైదానంలో మందు బాబులు లారీల పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్నారని, స్థానికులు కనిపిస్తే వీరంగం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా జనావాసంలో ఉన్న ఈ పార్కింగ్ మైదానాన్ని వేరే స్థలానికి తరలించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బస్ భవన్ పక్కనే సుమారు 8 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని... అక్కడికి ఈ చేపల పార్కింగ్​ను తరలించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇళ్ల మధ్య చేపల లారీల పార్కింగ్​... ఎక్కడ చూసినా చెత్తా చెదారం

ఫిష్ లారీ పార్కింగ్ వల్ల గంగపుత్ర కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు :

1. ఫిష్ లారీల నుంచి వచ్చే మురికి నీరు వల్ల దోమల బెడద.

2. రాత్రి పగలు తేడా లేకుండా వచ్చే వాహనాల మూలంగా వచ్చే శబ్దాలతో కాలనీ వాసులకు నిద్ర లేమీ, భద్రత కరవవుతోంది.

3. పార్కింగ్ స్థలంలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మైదానాన్నే బహిరంగంగా మల, మూత్ర విసర్జనలకు వాడుతున్నారు. ఫలితంగా విపరీతమైన దుర్వాసన వస్తోంది. అదనంగా పక్కనే ఉన్న చెత్త కుండీల నుంచి వచ్చే దుర్వాసననూ భరించలేకపోతున్నాం.

4. పార్కింగ్​ స్థలం తాగుడికి అడ్డాగా మారిపోయింది. మొత్తం బార్ లాగా యథేచ్ఛగా తాగుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇళ్ల మీదికి దాడులకు దిగుతున్నారు.

5. గత మూడేళ్లుగా అన్నీ శాఖలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనీ బస్తి వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే తమకు న్యాయం చేయాలని కార్పొరేషన్ ఉన్నతాధికారులను, ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్​గా పేరుగాంచిన ముషీరాబాద్ చేపల లారీల పార్కింగ్​ ఎన్నో సమస్యలకు నిలయంగా మారిపోయింది. లారీల నుంచి చేపలు దించుతుండగా కింద పడిన చేపల వేస్టేజీని పక్కనే ఉన్న చెత్త కుండీలో వేస్తున్నారు. దాని వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ బోర్డు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోయారు.

చేపల మార్కెట్​కు వచ్చీ పోయే వాహనాల వల్ల పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో పార్కింగ్ మైదానంలో మందు బాబులు లారీల పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్నారని, స్థానికులు కనిపిస్తే వీరంగం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా జనావాసంలో ఉన్న ఈ పార్కింగ్ మైదానాన్ని వేరే స్థలానికి తరలించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బస్ భవన్ పక్కనే సుమారు 8 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని... అక్కడికి ఈ చేపల పార్కింగ్​ను తరలించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇళ్ల మధ్య చేపల లారీల పార్కింగ్​... ఎక్కడ చూసినా చెత్తా చెదారం

ఫిష్ లారీ పార్కింగ్ వల్ల గంగపుత్ర కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు :

1. ఫిష్ లారీల నుంచి వచ్చే మురికి నీరు వల్ల దోమల బెడద.

2. రాత్రి పగలు తేడా లేకుండా వచ్చే వాహనాల మూలంగా వచ్చే శబ్దాలతో కాలనీ వాసులకు నిద్ర లేమీ, భద్రత కరవవుతోంది.

3. పార్కింగ్ స్థలంలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మైదానాన్నే బహిరంగంగా మల, మూత్ర విసర్జనలకు వాడుతున్నారు. ఫలితంగా విపరీతమైన దుర్వాసన వస్తోంది. అదనంగా పక్కనే ఉన్న చెత్త కుండీల నుంచి వచ్చే దుర్వాసననూ భరించలేకపోతున్నాం.

4. పార్కింగ్​ స్థలం తాగుడికి అడ్డాగా మారిపోయింది. మొత్తం బార్ లాగా యథేచ్ఛగా తాగుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇళ్ల మీదికి దాడులకు దిగుతున్నారు.

5. గత మూడేళ్లుగా అన్నీ శాఖలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనీ బస్తి వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే తమకు న్యాయం చేయాలని కార్పొరేషన్ ఉన్నతాధికారులను, ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

Last Updated : Jun 1, 2020, 5:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.