ETV Bharat / state

అత్యవసరం ఆపేస్తాం

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో జూనియర్​ డాక్టర్ల ఆందోళన మూడోరోజుకు చేరింది. వైద్యులపై రోగి బంధువుల దాడికి వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగుతోంది. ఉన్నతాధికారులతో చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే.. అత్యవసర సేవలు నిలిపివేస్తామని జూడాలు హెచ్చరించారు.

author img

By

Published : Feb 28, 2019, 5:38 PM IST

Updated : Feb 28, 2019, 6:05 PM IST

ర్యాలీ తీస్తున్న జూడాలు
అత్యవసరం ఆపేస్తాం
సికింద్రాబాద్​ గాంధీలో వైద్యులపై రోగి బంధువుల దాడిని నిరసిస్తూ చేస్తున్న ఆందోళనను జూనియర్​ డాక్టర్లు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇవాళ మూడోరోజు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టారు.
undefined

మంగళవారం రాత్రి గుండె సమస్యతో రెండు నెలల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాబు తరపు బంధువులు ఐసీయూలోకి చొచ్చుకెళ్లి వైద్యుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందించ లేదని తెలిపారు.

ఇవీ చూడండి:డాక్టర్ కాముడు

'చర్చలు' విఫలం

సమస్యను పరిష్కరించేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్​రెడ్డి రంగంలోకి దిగారు. ఇవాళ జూడాలతో చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. దాడి జరుగుతున్న సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీఎం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే తమకు లిఖిత పూర్వక హామీ కావాలని జూడాలు పట్టుబడుతున్నారు. వైద్యశాఖ మంత్రి స్వయంగా గాంధీకి వచ్చి చర్చలు జరపాలని డిమాండ్​ చేస్తున్నారు.

తమకు న్యాయం జరిగే వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు.

అత్యవసరం ఆపేస్తాం
సికింద్రాబాద్​ గాంధీలో వైద్యులపై రోగి బంధువుల దాడిని నిరసిస్తూ చేస్తున్న ఆందోళనను జూనియర్​ డాక్టర్లు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇవాళ మూడోరోజు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టారు.
undefined

మంగళవారం రాత్రి గుండె సమస్యతో రెండు నెలల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాబు తరపు బంధువులు ఐసీయూలోకి చొచ్చుకెళ్లి వైద్యుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందించ లేదని తెలిపారు.

ఇవీ చూడండి:డాక్టర్ కాముడు

'చర్చలు' విఫలం

సమస్యను పరిష్కరించేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్​రెడ్డి రంగంలోకి దిగారు. ఇవాళ జూడాలతో చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. దాడి జరుగుతున్న సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీఎం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే తమకు లిఖిత పూర్వక హామీ కావాలని జూడాలు పట్టుబడుతున్నారు. వైద్యశాఖ మంత్రి స్వయంగా గాంధీకి వచ్చి చర్చలు జరపాలని డిమాండ్​ చేస్తున్నారు.

తమకు న్యాయం జరిగే వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు.

sample description
Last Updated : Feb 28, 2019, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.