ETV Bharat / state

ఆసరాను దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు - Four accused arrested in aasara pensions scam

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తోన్న పింఛన్​ డబ్బులకు కక్కుర్తి పడిన కేటుగాళ్లు అక్రమ మార్గాల్లో సొమ్ము కాజేశారు. ఓ ప్రభుత్వ అధికారి సహకారంతో దాదాపు నాలుగు నెలలుగా 255 మంది పింఛన్​ సొమ్మును దారిమళ్లించారు. చివరకు హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

ఆసరాను దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు
author img

By

Published : Sep 17, 2019, 10:49 PM IST

సులభంగా డబ్బు సంపాదించేందుకు పాతబస్తీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరి కన్ను ఆసరా పింఛన్​పై పడింది. అడిగే వారే ఉండరు కదా అని అందిన కాడికి అడ్డంగా దోచుకుని కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఆసరా పింఛన్​ల స్కాం జరిగింది. ఓల్డ్ సిటీకి చెందిన ఇమ్రాన్, సోహెల్, అస్లాం, మోహిన్​లు ముఠాగా ఏర్పడి పింఛను సొమ్మును స్వాహా చేశారు.
ఆసరా పింఛన్ పంపిణీకి సంబంధించిన ఐడి, పాస్​వర్డ్​లను సంపాదించి... అసలు లబ్ధిదారులతో పాటు.. కొంతమంది అనర్హత కలిగిన వారిని లబ్ధిదారులుగా నమోదు చేశారు. దాదాపు 4 నెలలుగా 255 మంది పేర్లపై పింఛన్​ సొమ్మును దారి మళ్లించారు.

ఎలా దొరికారు..?

ఆసరా పింఛన్​లో జరిగిన మోసాలపై హైదరాబాద్​ ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓల్డ్​సీటీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు భాగ్యనగరం సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. తహసీల్దార్​ ఐడి ,పాస్వర్డ్​ల ద్వారా లబ్ధిదారుల పేర్లు, అకౌంట్ ఇతర వివరాలను మార్చేవారని.. వీరికి ప్రభుత్వ విభాగంలో జూనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న... ముఠాలో సభ్యుడైన అస్లాం సహకరించినట్లు వివరించారు.

ఈ స్కాములో నిందితులు దాదాపు రూ.25 లక్షలు కాజేసినట్లు జాయింట్ సీపీ వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చార్మినార్ తహసీల్దార్​ను హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

ఆసరాను దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు

ఇదీ చూడండి: పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?

సులభంగా డబ్బు సంపాదించేందుకు పాతబస్తీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరి కన్ను ఆసరా పింఛన్​పై పడింది. అడిగే వారే ఉండరు కదా అని అందిన కాడికి అడ్డంగా దోచుకుని కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఆసరా పింఛన్​ల స్కాం జరిగింది. ఓల్డ్ సిటీకి చెందిన ఇమ్రాన్, సోహెల్, అస్లాం, మోహిన్​లు ముఠాగా ఏర్పడి పింఛను సొమ్మును స్వాహా చేశారు.
ఆసరా పింఛన్ పంపిణీకి సంబంధించిన ఐడి, పాస్​వర్డ్​లను సంపాదించి... అసలు లబ్ధిదారులతో పాటు.. కొంతమంది అనర్హత కలిగిన వారిని లబ్ధిదారులుగా నమోదు చేశారు. దాదాపు 4 నెలలుగా 255 మంది పేర్లపై పింఛన్​ సొమ్మును దారి మళ్లించారు.

ఎలా దొరికారు..?

ఆసరా పింఛన్​లో జరిగిన మోసాలపై హైదరాబాద్​ ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓల్డ్​సీటీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు భాగ్యనగరం సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. తహసీల్దార్​ ఐడి ,పాస్వర్డ్​ల ద్వారా లబ్ధిదారుల పేర్లు, అకౌంట్ ఇతర వివరాలను మార్చేవారని.. వీరికి ప్రభుత్వ విభాగంలో జూనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న... ముఠాలో సభ్యుడైన అస్లాం సహకరించినట్లు వివరించారు.

ఈ స్కాములో నిందితులు దాదాపు రూ.25 లక్షలు కాజేసినట్లు జాయింట్ సీపీ వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చార్మినార్ తహసీల్దార్​ను హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

ఆసరాను దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు

ఇదీ చూడండి: పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.