ETV Bharat / state

'రాష్ట్రంలో కొవిడ్​ కట్టడికి ఆరోగ్య కమిటీలు వేయాలి'

కొవిడ్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ల పరిధిలో ఆరోగ్య కమిటీలు వేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, వైద్య అధికారులతో కమిటీలు వేసి... ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్​తో సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు.

author img

By

Published : Apr 23, 2021, 10:13 PM IST

mallu ravi on corona
telangana news

రాష్ట్రంలో కొవిడ్​ వ్యాప్తి తీవ్రంగా ఉందని మాజీ ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ల పరిధిలో ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ల పరిధిలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్యాధికారితో ఇదే రకమైన కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కమిటీల ద్వారా అత్యవసర మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, టీకాలు…. అవసరమైన వారికి అందేవిధంగా చూడాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు... వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో కొవిడ్​ వ్యాప్తి తీవ్రంగా ఉందని మాజీ ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ల పరిధిలో ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ల పరిధిలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్యాధికారితో ఇదే రకమైన కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కమిటీల ద్వారా అత్యవసర మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, టీకాలు…. అవసరమైన వారికి అందేవిధంగా చూడాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు... వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.