ETV Bharat / state

కార్పొరేటర్​ ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన

author img

By

Published : Oct 29, 2020, 9:15 PM IST

తమకు పరిహారం అందలేదని హైదరాబాద్​ చంపాపేట్‌ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన వరద బాధితులు కార్పొరేటర్​ ఇంటి ముందు ధర్నాకు దిగారు. వరద బాధితులందరికీ సహాయం అందజేస్తామని కార్పొరేటర్ రమణారెడ్డి భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

flood victims protest infront of corporater house in hyderabad
కార్పొరేటర్​ ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన

హైదరాబాద్​ చంపాపేట్‌ డివిజన్ పరిధిలోని రెడ్డికాలనీ, రాజిరెడ్డినగర్, పద్మానగర్​తోపాటు పలు కాలనీలకు చెందిన వరద బాధితులు... కార్పొరేటర్ రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమకు వరద పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ సాయం అందజేస్తామని కార్పొరేటర్ రమణారెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం ప్రతి బాధిత కుటుంబానికి అందిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.

హైదరాబాద్​ చంపాపేట్‌ డివిజన్ పరిధిలోని రెడ్డికాలనీ, రాజిరెడ్డినగర్, పద్మానగర్​తోపాటు పలు కాలనీలకు చెందిన వరద బాధితులు... కార్పొరేటర్ రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమకు వరద పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ సాయం అందజేస్తామని కార్పొరేటర్ రమణారెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం ప్రతి బాధిత కుటుంబానికి అందిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.

ఇదీ చదవండి: చెరువులు, నాలాల దురాక్రమణపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.