వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కోసం ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. 2019-20లో సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు వచ్చే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది.
ఆర్థికశాఖ వెబ్సైట్ ద్వారా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. జనవరి 7 వరకు సంబంధిత శాఖల కార్యదర్శులకు ప్రతిపాదనలు ఇవ్వాలని... తొమ్మిదో తేదీ వరకు ఆర్థికశాఖకు సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు