ETV Bharat / state

Festival Mela at Nampally Ground: ఈనెల 11 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో ఫెస్టివల్​ మేళా

author img

By

Published : Oct 10, 2021, 7:25 PM IST

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఫెస్టివల్ మేళా.. మినీ నుమాయిష్​ను నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది(Festival Mela at Nampally Exhibition Ground). దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ఫెస్టివల్ మేళా నిర్వహించబోతున్నామని సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ వెల్లడించారు.

nampally exhibition
nampally exhibition

దసరా, దీపావళి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో ఫెస్టివల్​ మేళా జరగనుంది(Festival Mela at Nampally Exhibition Ground). ఈ నెల 11నుంచి 31 వరకు... 20 రోజుల పాటు మేళా నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్​ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్​ తెలిపారు. కొవిడ్​ కారణంగా ఈ ఏడాది నుమాయిష్(Numaish Exhibition) నిర్వహించలేదని.. ఈ ఫెస్టివల్​ మేళా ద్వారా చిన్న పరిశ్రమల, చేతి వృత్తుల వారికి ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ మేళాలో 300 స్టాల్స్​ అందుబాటులో ఉంటాయన్నారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్, హ్యాండ్లూమ్స్, కశ్మీర్, రాజస్థాని డ్రెస్సెస్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని రకాల కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేళాను అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.

కొవిడ్​ వల్ల 2021లో నూమాయిష్​ ఎగ్జిబిషన్​ నిర్వహించలేదు. ఈసారి ఫెస్టివల్​ మేళా అనే పేరుతో చిన్న ఎగ్జిబిషన్​ ఏర్పాటు చేశాము. ఈనెల 11 నుంచి 31 వరకు 20రోజుల పాటు మేళా నిర్వహిస్తాము. నుమాయిష్​ అప్పుడైతే ఏవైతే స్టాల్స్​ ఉంటాయో.. అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు 300 వరకు స్టాల్స్​ ఉంటాయి. అన్ని రకాల వసతులు కల్పించాము. దసరా, దీపావళి సందర్భంగా ఈ మేళా నిర్వహిస్తున్నాము. జనవరి 1 2022 నుంచి ఎప్పిటిలాగే నుమాయిష్​ ఎగ్జిబిషన్​ నిర్వహిస్తాము.-ప్రభాశంకర్, ఎగ్జిబిషన్​ సొసైటీ కార్యదర్శి

ఇదీ చూడండి: Rana at Onco Cancer Centre: '45 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్​ పరీక్షలు చేయించుకోవాలి'

దసరా, దీపావళి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో ఫెస్టివల్​ మేళా జరగనుంది(Festival Mela at Nampally Exhibition Ground). ఈ నెల 11నుంచి 31 వరకు... 20 రోజుల పాటు మేళా నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్​ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్​ తెలిపారు. కొవిడ్​ కారణంగా ఈ ఏడాది నుమాయిష్(Numaish Exhibition) నిర్వహించలేదని.. ఈ ఫెస్టివల్​ మేళా ద్వారా చిన్న పరిశ్రమల, చేతి వృత్తుల వారికి ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ మేళాలో 300 స్టాల్స్​ అందుబాటులో ఉంటాయన్నారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్, హ్యాండ్లూమ్స్, కశ్మీర్, రాజస్థాని డ్రెస్సెస్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని రకాల కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేళాను అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.

కొవిడ్​ వల్ల 2021లో నూమాయిష్​ ఎగ్జిబిషన్​ నిర్వహించలేదు. ఈసారి ఫెస్టివల్​ మేళా అనే పేరుతో చిన్న ఎగ్జిబిషన్​ ఏర్పాటు చేశాము. ఈనెల 11 నుంచి 31 వరకు 20రోజుల పాటు మేళా నిర్వహిస్తాము. నుమాయిష్​ అప్పుడైతే ఏవైతే స్టాల్స్​ ఉంటాయో.. అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు 300 వరకు స్టాల్స్​ ఉంటాయి. అన్ని రకాల వసతులు కల్పించాము. దసరా, దీపావళి సందర్భంగా ఈ మేళా నిర్వహిస్తున్నాము. జనవరి 1 2022 నుంచి ఎప్పిటిలాగే నుమాయిష్​ ఎగ్జిబిషన్​ నిర్వహిస్తాము.-ప్రభాశంకర్, ఎగ్జిబిషన్​ సొసైటీ కార్యదర్శి

ఇదీ చూడండి: Rana at Onco Cancer Centre: '45 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్​ పరీక్షలు చేయించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.