బాహ్య వలయ రహదారిపై మే నెలాఖరు నాటికి రోజుకు 60వేల వాహనదారులు ఫాస్టాగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ, హెచ్జీసీఎల్ ప్రకటించింది. 158 కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఔటర్రింగ్ రోడ్డుపై ప్రతి రోజు 1లక్షా 30 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. వాటిలో దాదాపు 60 వేల వాహనాలు ఫాస్టాగ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) సదుపాయాన్ని కలిగివున్నాయని పేర్కొంది.
ఓఆర్ఆర్పై 2018 డిసెంబర్ 11వ తేదీ నుంచి ఫాస్టాగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రారంభంలో ఫాస్టాగ్నిబంధనలను 2019 మార్చి వరకు దాదాపు 10 వేల వాహనదారులు వినియోగించుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జీసీఎల్) అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 2020 మే నెల చివరి నాటికి సరాసరిగా రోజుకు 60 వేల మంది వాహనదారులు ఫాస్టాగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అధికారులు చెప్పిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
50 శాతం డెడికేటెడ్ లైన్లు...
ఓఆర్ఆర్ టోల్ప్లాజాలలో ఫాస్టాగ్ కోసం 50 శాతం డెడికేటెడ్ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఫాస్టాగ్ సదుపాయం లేని వాహనదారులకు ఫాస్టాగ్ లేన్లోకి వస్తే రెండింతలు ఫీజు వసూలు చేసే పద్ధతి అమలులోకి తీసుకురావడం వల్ల ఫాస్టాగ్వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
తిరుగు ప్రయాణంలో డిస్కౌంట్ సౌకర్యం...
ఫాస్టాగ్వినియోగదారుల కోసం హెచ్ఎండీఏ, హెచ్జీసీఎల్ యంత్రాంగం డిజిటల్చెల్లింపుల సదుపాయం కల్పించింది. అలాగే తిరుగు ప్రయాణంలో డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది దీనిని వినియోగించుకుంటున్నారు. ఓఆర్ఆర్పై ఫాస్టాగ్ లేని వాహనాలు కేవలం నాన్ డెడికేటెడ్(బ్లూ కలర్ లైన్) మార్గంలోనే ప్రవేశించాలని హెచ్ఎండీఏ, హెచ్జీసీఎల్ అధికారులు సూచించారు. ఓఆర్ఆర్పై ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్(ఆరెంజ్ కలర్ లైన్)లోకి ఫాస్టాగ్ కలిగిన వాహనాల రాకపోకలతో సమయం ఆదా అవుతుందన్నారు. ఫాస్టాగ్సదుపాయం లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలని హెచ్ఎండీఏ, హెచ్జీసీఎల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.