ETV Bharat / state

'రోజుకు 60 వేల మంది వినియోగించుకుంటున్నారు'

author img

By

Published : May 30, 2020, 9:34 PM IST

బాహ్య వలయ రహదారిపై ఫాస్టాగ్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెుదట్లో కొంత తక్కువగా ఉన్నప్పటికీ... మే నెలాఖారు నాటికి రోజుకు 60 వేల మంది వాహనదారులు ఫాస్టాగ్ ​​ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్ ప్రకటించింది.

fastag
fastag

బాహ్య వలయ రహదారిపై మే నెలాఖరు నాటికి రోజుకు 60వేల వాహనదారులు ఫాస్టాగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్ ప్రకటించింది. 158 కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఔటర్​రింగ్​ రోడ్డుపై ప్రతి రోజు 1లక్షా 30 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. వాటిలో దాదాపు 60 వేల వాహనాలు ఫాస్టాగ్​ ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్(ఈటీసీ)​ సదుపాయాన్ని కలిగివున్నాయని పేర్కొంది.

ఓఆర్ఆర్​పై 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి ఫాస్టాగ్​ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రారంభంలో ఫాస్టాగ్​నిబంధనలను 2019 మార్చి వరకు దాదాపు 10 వేల వాహనదారులు వినియోగించుకున్నారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జీసీఎల్​) అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 2020 మే నెల చివరి నాటికి సరాసరిగా రోజుకు 60 వేల మంది వాహనదారులు ఫాస్టాగ్​ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అధికారులు చెప్పిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

50 శాతం డెడికేటెడ్​ లైన్లు​...

ఓఆర్ఆర్​ టోల్​ప్లాజాలలో ఫాస్టాగ్​ కోసం 50 శాతం డెడికేటెడ్​ లైన్లు​ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఫాస్టాగ్​ సదుపాయం లేని వాహనదారులకు ఫాస్టాగ్​ లేన్​లోకి వస్తే రెండింతలు ఫీజు వసూలు చేసే పద్ధతి అమలులోకి తీసుకురావడం వల్ల ఫాస్టాగ్​వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

తిరుగు ప్రయాణంలో డిస్కౌంట్ సౌకర్యం...

ఫాస్టాగ్​వినియోగదారుల కోసం హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్​ యంత్రాంగం డిజిటల్​చెల్లింపుల సదుపాయం కల్పించింది. అలాగే తిరుగు ప్రయాణంలో డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది దీనిని వినియోగించుకుంటున్నారు. ఓఆర్ఆర్​పై ఫాస్టాగ్​ లేని వాహనాలు కేవలం నాన్​ డెడికేటెడ్​(బ్లూ కలర్​ లైన్) మార్గంలోనే ప్రవేశించాలని హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్​ అధికారులు సూచించారు. ఓఆర్ఆర్​పై ఫాస్టాగ్​ డెడికేటెడ్​ లైన్(ఆరెంజ్​ కలర్​ లైన్)​లోకి ఫాస్టాగ్​ కలిగిన వాహనాల రాకపోకలతో సమయం ఆదా అవుతుందన్నారు. ఫాస్టాగ్​సదుపాయం లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలని హెచ్​ఎండీఏ, హెచ్​జీసీఎల్​ అధికారులు విజ్ఞప్తి చేశారు.

బాహ్య వలయ రహదారిపై మే నెలాఖరు నాటికి రోజుకు 60వేల వాహనదారులు ఫాస్టాగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్ ప్రకటించింది. 158 కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఔటర్​రింగ్​ రోడ్డుపై ప్రతి రోజు 1లక్షా 30 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. వాటిలో దాదాపు 60 వేల వాహనాలు ఫాస్టాగ్​ ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్(ఈటీసీ)​ సదుపాయాన్ని కలిగివున్నాయని పేర్కొంది.

ఓఆర్ఆర్​పై 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి ఫాస్టాగ్​ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రారంభంలో ఫాస్టాగ్​నిబంధనలను 2019 మార్చి వరకు దాదాపు 10 వేల వాహనదారులు వినియోగించుకున్నారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జీసీఎల్​) అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 2020 మే నెల చివరి నాటికి సరాసరిగా రోజుకు 60 వేల మంది వాహనదారులు ఫాస్టాగ్​ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అధికారులు చెప్పిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

50 శాతం డెడికేటెడ్​ లైన్లు​...

ఓఆర్ఆర్​ టోల్​ప్లాజాలలో ఫాస్టాగ్​ కోసం 50 శాతం డెడికేటెడ్​ లైన్లు​ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఫాస్టాగ్​ సదుపాయం లేని వాహనదారులకు ఫాస్టాగ్​ లేన్​లోకి వస్తే రెండింతలు ఫీజు వసూలు చేసే పద్ధతి అమలులోకి తీసుకురావడం వల్ల ఫాస్టాగ్​వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

తిరుగు ప్రయాణంలో డిస్కౌంట్ సౌకర్యం...

ఫాస్టాగ్​వినియోగదారుల కోసం హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్​ యంత్రాంగం డిజిటల్​చెల్లింపుల సదుపాయం కల్పించింది. అలాగే తిరుగు ప్రయాణంలో డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది దీనిని వినియోగించుకుంటున్నారు. ఓఆర్ఆర్​పై ఫాస్టాగ్​ లేని వాహనాలు కేవలం నాన్​ డెడికేటెడ్​(బ్లూ కలర్​ లైన్) మార్గంలోనే ప్రవేశించాలని హెచ్ఎండీఏ, హెచ్​జీసీఎల్​ అధికారులు సూచించారు. ఓఆర్ఆర్​పై ఫాస్టాగ్​ డెడికేటెడ్​ లైన్(ఆరెంజ్​ కలర్​ లైన్)​లోకి ఫాస్టాగ్​ కలిగిన వాహనాల రాకపోకలతో సమయం ఆదా అవుతుందన్నారు. ఫాస్టాగ్​సదుపాయం లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలని హెచ్​ఎండీఏ, హెచ్​జీసీఎల్​ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.