తెలంగాణలో కొత్తగా అనుమతి ఇచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతిని రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. దొడ్డిదారిన ఇచ్చిన ఆ ఆర్డినెన్స్ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆర్డినెన్స్లో పేదలు విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతారని వంశీచంద్ తెలిపారు. ఆ విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీల నియామకం చేయలేదని.. కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రం అనుమతులిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధించే ఫ్యాకల్టీలకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఈ తరుణంలో వారంతా కూలీ పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్