ETV Bharat / state

ఈఎస్​ఐ కేసులో అనిశా కోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్

author img

By

Published : Jun 16, 2020, 7:58 AM IST

అనిశా కేసులో బెయిల్​ మంజూరు కోరుతూ ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని.. అయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. హైకోర్టు న్యాయవాదులు ఆయన తరఫున పిటిషన్లు దాఖలు చేశారు.

ex-minister-achhennaidu-filed-bail-petition-at-acb-court-on-esi-issue
ఈఎస్​ఐ వ్యవహారంలో బెయిల్​ కోసం అనిశా కోర్టుకు అచ్చెన్నాయుడు

ఈఎస్​ఐ వ్యవహారంలో అనిశా అధికారులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. టెలీ సంస్థలకు వైద్య సేవలు అప్పగించాలని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డెరెక్టర్‌ను 2016లో లేఖల ద్వారా ఆదేశించారనేది తనపై ఆరోపణ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మూడేళ్ల జాప్యం జరిగింది

2017లో మంత్రిగా వైదొలిగితే.. ఈ నెల 10న కేసు నమోదుచేశారని... పోలీసులకు ఫిర్యాదు చేయడంలో మూడేళ్ల జాప్యం జరిగిందన్నారు. అవినీతి ఆరోపణ ఘటనల్లో మూడు మాసాల తర్వాత ఫిర్యాదు అందితే.. కేసు నమోదు చేసేందుకు ముందు ప్రాథమిక విచారణ జరపాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుత కేసులో ఈ నెల 10న ఫిర్యాదు చేయగా.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా అదే రోజు తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. తాను 2017 ఏప్రిల్‌ 2న కార్మికశాఖ మంత్రిగా బాధ్యతల నుంచి వైదొలిగానని... 2018 జూలై 28 నుంచి అవినీతి నిరోధక సవరణ చట్టం - 2018 అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు తనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవన్నారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ కక్ష పెంచుకుని తనను ఈ కేసులో ఇరికించారని.. తాను ఏ నేరానికి పాల్పడలేదన్నారు.

కక్షతోనే ఇరికించారు

తన సోదరుడు ఎర్రన్నాయుడు.. 2011లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్‌ సంపద కూడగట్టారని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని... ప్రాథమిక విచారణ తర్వాత ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌, ఆయన సహచరులు, సంస్థలపై కేసు నమోదైందని గుర్తు చేశారు. తర్వాత సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసి 16 నెలలు జైళ్లో ఉంచిదన్నారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబంపై కక్ష పెంచుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్​ సీఎం ఆదేశాల మేరకు తప్పుడు కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించానని... ప్రజావ్యతిరేక విధానాలను నిలదీసినందుకే కేసులో ఇరికించారన్నారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 18న ముగియనున్నాయని పేర్కొన్న అచ్చెన్నాయుడు... 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడానికి కుట్ర పన్నారన్నారు. ఇది నేర దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందన్నారు.

శస్త్ర చికిత్స జరిగిందని చెప్పినా..

ఈ నెల 11న తనకు శస్త్రచికిత్స జరిగిందని.. పోలీసులు ఇంటిని చుట్టుముట్టి 12న తనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అచ్చెన్నాయుడు పిటిషన్‌లో తెలిపారు. కొన్ని గంటల క్రితం శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని... కారులో 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారని పేర్కొన్నారు. రిమాండ్‌కు తరలించేందుకు ముందు వైద్యాధికారి చికిత్స అవసరమని ధ్రువీకరించినా... పట్టించుకోకుండా ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారన్నారు. వైద్యాధికారి ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారి జడ్జిని తప్పుదోవ పట్టించే యత్నం చేశారన్నారు. 12వ తేదీ అరెస్టు చేసి.. 13వ తేదీ ఉదయం ఒకటిన్నర గంటల సమయంలో పోలీసులు తన పట్ల అమానవీయంగా వ్యవహించారని ఆరోపించారు. మానవ హక్కుల్ని ఉల్లంఘించారన్నారు. పోలీసుల అదుపులో ఉండగానే తనకు నోటీసులిచ్చి... రెండు గంటల తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టుకు ముందు తనకు నోటీసులు ఎందుకివ్వలేదో అర్థం కావడం లేదన్నారు.

అరెస్టు చట్ట విరుద్ధం

ప్రస్తుత ఐఎంఎస్​(ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీస్​) డైరెక్టర్‌ అనిశాకు ఇచ్చిన ఫిర్యాదులో... అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేయదగ్గ అంశాలు లేవని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజాసేవకుడిగా ఏదైనా ఆస్తిని ఇతరులకు అప్పగించినట్లు తనపై ఆరోపణ లేదన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అనిశా అధికారులు తనపై కేసు నమోదు, అరెస్టు చేయకుండా ఉండాల్సిందన్నారు. ప్రస్తుత కేసులో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం నుంచి పోలీసులకు ముందస్తు ఆమోదం లేదని పేర్కొన్నారు. పీసీ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆమోదం లేకుండా దర్యాప్తు చేయడం, అరెస్టు చేయడం చట్టవిరుద్ధమన్నారు. రిమాండ్‌ రిపోర్టులో ప్రభుత్వ ఆమోదం ఉందని దర్యాప్తు అధికారి... అనిశా ప్రత్యేక కోర్టుకు తప్పు సమాచారం ఇచ్చారని అచ్చెన్నాయుడు పిటిషన్‌లో పేర్కొన్నారు.

దర్యాప్తునకు సహకరిస్తా

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని... ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని అచ్చెన్నాయుడు పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. కరోనా చికిత్సతో సంబంధం లేకుండా వైద్య సేవలందిస్తున్న గుంటూరు, విజయవాడలోని ఏదైనా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తనను పంపేలా ఆదేశాలు జారీచేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు ఈ పిటిషన్లు వేశారు.

ఇదీ చూడండి..

ఈ ఏడాదికి 'పది' పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయాలి: చంద్రబాబు

ఈఎస్​ఐ వ్యవహారంలో అనిశా అధికారులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. టెలీ సంస్థలకు వైద్య సేవలు అప్పగించాలని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డెరెక్టర్‌ను 2016లో లేఖల ద్వారా ఆదేశించారనేది తనపై ఆరోపణ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మూడేళ్ల జాప్యం జరిగింది

2017లో మంత్రిగా వైదొలిగితే.. ఈ నెల 10న కేసు నమోదుచేశారని... పోలీసులకు ఫిర్యాదు చేయడంలో మూడేళ్ల జాప్యం జరిగిందన్నారు. అవినీతి ఆరోపణ ఘటనల్లో మూడు మాసాల తర్వాత ఫిర్యాదు అందితే.. కేసు నమోదు చేసేందుకు ముందు ప్రాథమిక విచారణ జరపాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుత కేసులో ఈ నెల 10న ఫిర్యాదు చేయగా.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా అదే రోజు తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. తాను 2017 ఏప్రిల్‌ 2న కార్మికశాఖ మంత్రిగా బాధ్యతల నుంచి వైదొలిగానని... 2018 జూలై 28 నుంచి అవినీతి నిరోధక సవరణ చట్టం - 2018 అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు తనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవన్నారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ కక్ష పెంచుకుని తనను ఈ కేసులో ఇరికించారని.. తాను ఏ నేరానికి పాల్పడలేదన్నారు.

కక్షతోనే ఇరికించారు

తన సోదరుడు ఎర్రన్నాయుడు.. 2011లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్‌ సంపద కూడగట్టారని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని... ప్రాథమిక విచారణ తర్వాత ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌, ఆయన సహచరులు, సంస్థలపై కేసు నమోదైందని గుర్తు చేశారు. తర్వాత సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసి 16 నెలలు జైళ్లో ఉంచిదన్నారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబంపై కక్ష పెంచుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్​ సీఎం ఆదేశాల మేరకు తప్పుడు కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించానని... ప్రజావ్యతిరేక విధానాలను నిలదీసినందుకే కేసులో ఇరికించారన్నారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 18న ముగియనున్నాయని పేర్కొన్న అచ్చెన్నాయుడు... 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడానికి కుట్ర పన్నారన్నారు. ఇది నేర దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందన్నారు.

శస్త్ర చికిత్స జరిగిందని చెప్పినా..

ఈ నెల 11న తనకు శస్త్రచికిత్స జరిగిందని.. పోలీసులు ఇంటిని చుట్టుముట్టి 12న తనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అచ్చెన్నాయుడు పిటిషన్‌లో తెలిపారు. కొన్ని గంటల క్రితం శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని... కారులో 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారని పేర్కొన్నారు. రిమాండ్‌కు తరలించేందుకు ముందు వైద్యాధికారి చికిత్స అవసరమని ధ్రువీకరించినా... పట్టించుకోకుండా ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారన్నారు. వైద్యాధికారి ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారి జడ్జిని తప్పుదోవ పట్టించే యత్నం చేశారన్నారు. 12వ తేదీ అరెస్టు చేసి.. 13వ తేదీ ఉదయం ఒకటిన్నర గంటల సమయంలో పోలీసులు తన పట్ల అమానవీయంగా వ్యవహించారని ఆరోపించారు. మానవ హక్కుల్ని ఉల్లంఘించారన్నారు. పోలీసుల అదుపులో ఉండగానే తనకు నోటీసులిచ్చి... రెండు గంటల తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టుకు ముందు తనకు నోటీసులు ఎందుకివ్వలేదో అర్థం కావడం లేదన్నారు.

అరెస్టు చట్ట విరుద్ధం

ప్రస్తుత ఐఎంఎస్​(ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీస్​) డైరెక్టర్‌ అనిశాకు ఇచ్చిన ఫిర్యాదులో... అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేయదగ్గ అంశాలు లేవని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజాసేవకుడిగా ఏదైనా ఆస్తిని ఇతరులకు అప్పగించినట్లు తనపై ఆరోపణ లేదన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అనిశా అధికారులు తనపై కేసు నమోదు, అరెస్టు చేయకుండా ఉండాల్సిందన్నారు. ప్రస్తుత కేసులో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం నుంచి పోలీసులకు ముందస్తు ఆమోదం లేదని పేర్కొన్నారు. పీసీ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆమోదం లేకుండా దర్యాప్తు చేయడం, అరెస్టు చేయడం చట్టవిరుద్ధమన్నారు. రిమాండ్‌ రిపోర్టులో ప్రభుత్వ ఆమోదం ఉందని దర్యాప్తు అధికారి... అనిశా ప్రత్యేక కోర్టుకు తప్పు సమాచారం ఇచ్చారని అచ్చెన్నాయుడు పిటిషన్‌లో పేర్కొన్నారు.

దర్యాప్తునకు సహకరిస్తా

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని... ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని అచ్చెన్నాయుడు పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. కరోనా చికిత్సతో సంబంధం లేకుండా వైద్య సేవలందిస్తున్న గుంటూరు, విజయవాడలోని ఏదైనా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తనను పంపేలా ఆదేశాలు జారీచేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు ఈ పిటిషన్లు వేశారు.

ఇదీ చూడండి..

ఈ ఏడాదికి 'పది' పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.