ETV Bharat / state

'శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ సూచించారు. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్​పై నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

author img

By

Published : Dec 10, 2019, 5:44 PM IST

Everyone in Sanitation needs partners
శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

హైదరాబాద్​ నగరంలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు శానిటేషన్​పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈస్ట్​ జోన్​ పరిధిలోని గడ్డి అన్నారంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ పాల్గొన్నారు. దోమల నియంత్రణకు నూతన ఫాగింగ్ యంత్రాలు ప్రారంభించి సిబ్బందికి అందజేశారు.

ఇతర నగరాలతో పోల్చితే శానిటేషన్​లో మనం చాలా ముందంజలో ఉన్నామని.. నగరంలో ఉన్న సుమారు కోటి మంది జనాభా కోసం దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని రామ్మోహన్​ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శానిటేషన్​లో భాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్​ సాధ్యపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్​ వాడకాన్ని ప్రజలు పూర్తిగా నిషేధించాలని కోరారు.

నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక డ్రైవ్​లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఇదీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

హైదరాబాద్​ నగరంలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు శానిటేషన్​పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈస్ట్​ జోన్​ పరిధిలోని గడ్డి అన్నారంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ పాల్గొన్నారు. దోమల నియంత్రణకు నూతన ఫాగింగ్ యంత్రాలు ప్రారంభించి సిబ్బందికి అందజేశారు.

ఇతర నగరాలతో పోల్చితే శానిటేషన్​లో మనం చాలా ముందంజలో ఉన్నామని.. నగరంలో ఉన్న సుమారు కోటి మంది జనాభా కోసం దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని రామ్మోహన్​ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శానిటేషన్​లో భాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్​ సాధ్యపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్​ వాడకాన్ని ప్రజలు పూర్తిగా నిషేధించాలని కోరారు.

నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక డ్రైవ్​లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఇదీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

Intro:శానిటేషన్ పై నాలుగు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ పరిధిలో గడ్డి అన్నారం డివిజన్ దిల్ షుక్ నగర్ లో లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్ బొంతు రామ్మోహన్.


Body:ఆయన మాట్లాడుతూ శానిటేషన్ పై ఇతర నగరాలతో పోల్చితే మనం చాలా ముందంజలో ఉన్నామని, నగరంలో కోటి మంది జనాభా ఉన్నారు అని ,వాళ్లకు దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, ఇంటింటికీ మొత్తం 48 వేల బీన్స్ ,44 లక్షల కుటుంబాలకు ఇచ్చామని ,చెప్తాను సేకరించడానికి ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయని, అధికారులు ఒక్కరే దీనిలో భాగస్వామ్యం అయితే సరిపోదని, ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కోరారు.


Conclusion:ఈ క్లినెల్లన్స్(clean lines) డ్రైవ్ లో స్థానికంగా ఉన్న సమస్యను అన్ని పరిష్కరిస్తామని, నాలుగు రోజుల టైం లో ఏం చేయాలి అని ఒక ప్రణాళికను సిద్ధం చేశామని, ఈ నాలుగు డ్రైవ్ లో అన్ని జిహెచ్ఎంసి వింగ్లు సమన్వయం తో పని చేస్తామని ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్పొరేటర్లు, సంబంధించిన అధికారులు అందరూ భాగస్వామ్యం అవుతారని, అందరూ కలిసి కింద స్థాయి నుండి ఉచిత పాటించాలని, దోమలు నూతన ఫాగింగ్ యంత్రాలు ప్రారంభించి సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ,డిప్యూటీ కమిషనర్ మెడికల్ అధికారులు సిబ్బంది, కార్పొరేటర్లు ,స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.

బైట్: బొంతు రామ్మోహన్ (మేయర్)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.