ETV Bharat / state

గాంధీలో కరోనా రోగులకు సౌకర్యాలు కల్పించాలి: డీవైఎఫ్​ఐ - సికింద్రాబాద్​లోని ప్రధాన వార్తలు

గాంధీ ఆస్పత్రిలో సరైన వసతులు లేక కొవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు.

dyfi-leaders-protest-at-gandhi-hospital
గాంధీలో కరోనా రోగులకు సౌకర్యాలు కల్పించాలి: డీవైఎఫ్​ఐ
author img

By

Published : Jun 14, 2020, 5:50 PM IST

Updated : Jun 14, 2020, 10:10 PM IST

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద డీవైఎఫ్​ఐ నాయకులు నిరసనకు దిగారు. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్​ రోగులకు సరైన వసతులు కల్పించడం లేదని డీవైఎఫ్ఐ నాయకుడు మహేందర్ ఆరోపించారు. కరోనా కట్టడికి, రోగులకు చికిత్స అందించడానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని విమర్శించారు.

కరోనా పరీక్షలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సడలింపు తరువాత వైన్ షాపులు, అన్ని రంగాల వారికి అనుమతులు ఇవ్వడం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగిందన్నారు. వైరస్​ విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ... కొవిడ్​ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద డీవైఎఫ్​ఐ నాయకులు నిరసనకు దిగారు. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్​ రోగులకు సరైన వసతులు కల్పించడం లేదని డీవైఎఫ్ఐ నాయకుడు మహేందర్ ఆరోపించారు. కరోనా కట్టడికి, రోగులకు చికిత్స అందించడానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని విమర్శించారు.

కరోనా పరీక్షలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సడలింపు తరువాత వైన్ షాపులు, అన్ని రంగాల వారికి అనుమతులు ఇవ్వడం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగిందన్నారు. వైరస్​ విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ... కొవిడ్​ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

Last Updated : Jun 14, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.