ETV Bharat / state

Dost Seats Allotments : రెండో విడత ప్రారంభమైన దోస్త్​ సీట్ల రిజిస్ట్రేషన్లు.. చివరి తేదీ ఎప్పుడో తెలుసా?

Dost Degree Seats Allotments In Telangana : సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మొదటి విడతలో నాలుగో వంతు సీట్లు కూడా భర్తీ కాలేదు. రాష్ట్రంలో సుమారు మూడున్నర లక్షల సీట్లు ఉండగా.. కేవలం 73వేల మంది విద్యార్థులే సీట్లు పొందారు. రాష్ట్రంలో 63 డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు ఒక్క విద్యార్థి కూడా ముందుకు రాలేదు. డిగ్రీలో కూడా కొన్నికోర్సులకు మాత్రం డిమాండ్​ బాగానే కనిపిస్తోంది. నేటి నుంచి రెండో విడత దోస్త్​ రిజిస్ట్రేషన్లు, వెబ్​ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు.

author img

By

Published : Jun 16, 2023, 9:17 PM IST

Updated : Jun 16, 2023, 9:47 PM IST

Dost
Dost

Second Phase Of Dost Seats Allotment Started In Telangana : రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ ద్వారా 889 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని 512 కోర్సుల్లో 3,56,258 సీట్ల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఇవాళ 73,220 మందికి డిగ్రీ సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి విడతలో 1,05,935 మంది దోస్త్​లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో కేవలం 78,212 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రెండో విడత దోస్త్​ రిజిస్ట్రేషన్లు, వెబ్​ ఆప్షన్లను నేటి నుంచి ప్రారంభించారు.

మరోవైపు తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 4,992 మందికి ఏకంగా సీట్లు దక్కనే లేదు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 53,032 మందికి మొదటి కోరుకున్న సీటే దక్కింది. ఈ ఏడాది కూడా కామర్స్​లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 45.41 శాతం అంటే 33,251 మంది కామర్స్ విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్​లో 16,434 మంది.. భౌతిక శాస్త్రంలో 13,468.. ఆర్ట్స్​లో 7,771.. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంజినీర్, మెషీన్ లెర్నింగులో 1,995 మంది విద్యార్థులు సీటు పొందారు.

అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువ : సీటు పొందిన విద్యార్థుల్లో ఆంగ్లమాధ్యమం 68,494 మంది.. తెలుగు మాధ్యమంలో 4,226 మంది ఉన్నారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు. ఇవాళ కేటాయించిన మొదటి విడత సీట్లలో అబ్బాయిలు 60.25 శాతంతో 44,113 మంది ఉండగా.. అమ్మాయిలు 39.75 శాతంతో 29,107 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 63 డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.

Dost Seats Allotment For Degree In Telangana : మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు దోస్త్ వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటు రిజర్వ్ చేసుకున్న తర్వాత అవసరమైతే రెండో విడతలో మరింత మెరుగైన సీటు కోసం ప్రయత్నించవచ్చనని ఆయన పేర్కొన్నారు. ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే.. సీటు కోల్పోతారని కన్వీనర్ స్పష్టం చేశారు. నేటి నుంచి ఈనెల 27 వరకు దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు జరుగుతాయి. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత.. ఇంకా 2,83,038 సీట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.

ఇవీ చదవండి :

Second Phase Of Dost Seats Allotment Started In Telangana : రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ ద్వారా 889 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని 512 కోర్సుల్లో 3,56,258 సీట్ల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఇవాళ 73,220 మందికి డిగ్రీ సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి విడతలో 1,05,935 మంది దోస్త్​లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో కేవలం 78,212 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రెండో విడత దోస్త్​ రిజిస్ట్రేషన్లు, వెబ్​ ఆప్షన్లను నేటి నుంచి ప్రారంభించారు.

మరోవైపు తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 4,992 మందికి ఏకంగా సీట్లు దక్కనే లేదు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 53,032 మందికి మొదటి కోరుకున్న సీటే దక్కింది. ఈ ఏడాది కూడా కామర్స్​లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 45.41 శాతం అంటే 33,251 మంది కామర్స్ విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్​లో 16,434 మంది.. భౌతిక శాస్త్రంలో 13,468.. ఆర్ట్స్​లో 7,771.. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంజినీర్, మెషీన్ లెర్నింగులో 1,995 మంది విద్యార్థులు సీటు పొందారు.

అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువ : సీటు పొందిన విద్యార్థుల్లో ఆంగ్లమాధ్యమం 68,494 మంది.. తెలుగు మాధ్యమంలో 4,226 మంది ఉన్నారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు. ఇవాళ కేటాయించిన మొదటి విడత సీట్లలో అబ్బాయిలు 60.25 శాతంతో 44,113 మంది ఉండగా.. అమ్మాయిలు 39.75 శాతంతో 29,107 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 63 డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.

Dost Seats Allotment For Degree In Telangana : మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు దోస్త్ వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటు రిజర్వ్ చేసుకున్న తర్వాత అవసరమైతే రెండో విడతలో మరింత మెరుగైన సీటు కోసం ప్రయత్నించవచ్చనని ఆయన పేర్కొన్నారు. ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే.. సీటు కోల్పోతారని కన్వీనర్ స్పష్టం చేశారు. నేటి నుంచి ఈనెల 27 వరకు దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు జరుగుతాయి. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత.. ఇంకా 2,83,038 సీట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 16, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.