హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. అధికార తెరాసకు పెద్దసంఖ్యలో సీట్లు తగ్గగా... భారతీయ జనతాపార్టీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మజ్లిస్, తన స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో మాదిగానే రెండు సీట్లతో సరిపెట్టుకొంది.
భాజపాకు భారీగా పెరిగిన ఓటింగ్...
ఓట్ల పరంగా చూస్తే ఎన్నికల్లో మొత్తం 33 లక్షలా 62 వేల 249 ఓట్లు చెల్లుబాటయ్యాయి. వీటిలో తెరాస 12 లక్షల 4వేల 167 ఓట్లను సాధించింది. భాజపాకు 11లక్షల 95వేల 711 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ కంటే కమలదళానికి 19వేల 233 ఓట్లు తక్కువగా వచ్చాయి. మజ్లిస్కు 6లక్షల 30వేల 866 ఓట్లు రాగా... హస్తానికి 2లక్షల 24వేల 528 ఓట్లు దక్కాయి.
తెరాసకు తగ్గిన ఓట్లు...
2016 ఎన్నికల్లో తెరాస 14 లక్షల 68 వేల 618 ఓట్లు సాధించగా... ఈ సారి గతంలో కంటే 2 లక్షల 64 వేల 451 ఓట్లు తగ్గాయి. భాజపాకు గత ఎన్నికల్లో 3 లక్షల 46వేల 253 ఓట్లు రాగా... ఈ ఎన్నికల్లో మరో 8 లక్షల 49 వేల 458 ఓట్లు పెరిగాయి. మజ్లిస్కు గత ఎన్నికల్లో 5లక్షల 30వేల 812 ఓట్లు దక్కగా.... ఈసారి పెరుగుదల లక్షా 54 గా ఉంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 3 లక్షల 48వేల 388 ఓట్లు సాధించగా... ఈ ఎన్నికల్లో లక్షా 23వేల 860 ఓట్లు తక్కువగా వచ్చాయి.