ఏపీలోని అంతర్వేది ఘటన కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని.. తాము చేసిన దర్యాప్తు నివేదికను సీబీఐకి అప్పగిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి వాటన్నింటిని క్రోడీకరించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
ఈ ఘటనతో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయల వద్ద భద్రతను పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం అంతర్వేదిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. ఇంటెలిజెన్స్ అలెర్ట్స్ ఏమీ లేవన్న డీజీపీ.. అందరూ దర్యాప్తునకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: అంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం...