ETV Bharat / state

Drugs Supply Gang Arrest : వీడొక్కడే మూవీ సీన్ రిపీట్​.. గ్యాంగ్​ అరెస్ట్​

author img

By

Published : May 6, 2023, 5:26 PM IST

Drugs Supply Gang Arrest in Hyderabad : ఓ సినిమాలో గంజాయి​ని ప్యాకెట్లలో పెట్టి మింగి.. అనుకున్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత వాటిని బయటకు తీస్తారు. అలాంటి సీనే రిపీట్​ చేస్తున్న ఓ ముఠాను సైబరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రూ.కోటీ 33 లక్షల విలువైన 303 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్​లో ఇద్దరు నైజీరియన్లు ఉండగా.. ఒకరిని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడు.

Police caught a gang supplying cocaine
Police caught a gang supplying cocaine
కొకైన్​ సరఫరా చేస్తున్న గ్యాంగ్​ను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

Drugs Supply Gang Arrest in Hyderabad : వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. ఆ తర్వాత మాదక ద్రవ్యాలను విక్రయించడమే వ్యాపారంగా మలచుకున్నాడు. కొకైన్ విక్రయిస్తూ లాభాలు చవిచూశాడు. తనలాగే వ్యాపారంలో నష్టపోయిన మరో ఇద్దరిని ఏజెంట్లుగా నియమించుకొని మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడు. నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి, హైదరాబాద్​లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర​ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​కు చెందిన చింతా రాకేశ్ అనే వ్యక్తి గతంలో డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసేవాడు. అందులో నష్టం రావడంతో.. డ్రగ్స్​ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని మాదక ద్రవ్యాలను రవాణా చేయడం మొదలుపెట్టాడు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్​ సహా ఇతర పట్టణాల్లో కొకైన్​ విక్రయించాడు. గోవాలో రూ.7 వేలకు గ్రాము చొప్పున కొని.. హైదరాబాద్​లో రూ.18 వేలకు అమ్ముతున్నాడు.

పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో గొట్టం గోలీల్లో కొకైన్ నింపుతున్నారు. ఆ తర్వాత వాటిని మింగి.. నిర్ధేశించుకున్న ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ బస చేస్తారు. మల విసర్జన సమయంలో ఆ గొట్టం గోలీలు సైతం మలంతో పాటు బయటికు వస్తాయి. అనంతరం ఆ గొట్టం గోలీలను శుభ్రపరిచి వాటి లోపల ఉన్న కొకైన్​ను బయిటకు తీసి ప్యాకెట్లలోకి మారుస్తున్నారు. ఏదైనా ఆహారం తీసుకుంటే జీర్ణమైపోతుంది.. కానీ గొట్టం గోళీలకు ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థం, జీర్ణక్రియలో కరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిందితుల చీకటి వ్యాపారాన్ని పసిగట్టిన సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులు.. వారిపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

వారి దగ్గర నుంచి రూ.కోటీ 33 లక్షల విలువైన 303 గ్రాముల కొకైన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు కార్లు, ఐదు మొబైల్స్​ను సీజ్​ చేశారు. ఈ కేసులో నైజీరియన్ విక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్‌ గాబ్రియల్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ చీకటి వ్యాపారాన్ని మొత్తం వాట్సప్​ ద్వారా చేశారు. వాట్సప్​ చాటింగ్​ పరిశీలించగా.. కొంత మంది ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలిపారు. అవసరమైతే వినియోగదారులను అరెస్ట్ చేస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

"ఈ గ్యాంగ్​లో ఐదుగురు ఉన్నారు. ఈ ముఠాకు చింతా రాకేశ్ నాయకుడు. ఇతను ఇద్దరిని చేర్చుకుని గోవాలో నైజీరియన్స్​తో సరుకు ఎప్పటికప్పుడు తెచ్చుకుని హైదరాబాద్​లో అమ్మేవాడు. అక్కడ రూ.7 వేలకు కొని.. ఇక్కడ రూ.18 వేలకు అమ్ముతున్నాడు." - స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ

ఇవీ చదవండి:

కొకైన్​ సరఫరా చేస్తున్న గ్యాంగ్​ను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

Drugs Supply Gang Arrest in Hyderabad : వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. ఆ తర్వాత మాదక ద్రవ్యాలను విక్రయించడమే వ్యాపారంగా మలచుకున్నాడు. కొకైన్ విక్రయిస్తూ లాభాలు చవిచూశాడు. తనలాగే వ్యాపారంలో నష్టపోయిన మరో ఇద్దరిని ఏజెంట్లుగా నియమించుకొని మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడు. నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి, హైదరాబాద్​లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర​ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​కు చెందిన చింతా రాకేశ్ అనే వ్యక్తి గతంలో డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసేవాడు. అందులో నష్టం రావడంతో.. డ్రగ్స్​ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని మాదక ద్రవ్యాలను రవాణా చేయడం మొదలుపెట్టాడు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్​ సహా ఇతర పట్టణాల్లో కొకైన్​ విక్రయించాడు. గోవాలో రూ.7 వేలకు గ్రాము చొప్పున కొని.. హైదరాబాద్​లో రూ.18 వేలకు అమ్ముతున్నాడు.

పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో గొట్టం గోలీల్లో కొకైన్ నింపుతున్నారు. ఆ తర్వాత వాటిని మింగి.. నిర్ధేశించుకున్న ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ బస చేస్తారు. మల విసర్జన సమయంలో ఆ గొట్టం గోలీలు సైతం మలంతో పాటు బయటికు వస్తాయి. అనంతరం ఆ గొట్టం గోలీలను శుభ్రపరిచి వాటి లోపల ఉన్న కొకైన్​ను బయిటకు తీసి ప్యాకెట్లలోకి మారుస్తున్నారు. ఏదైనా ఆహారం తీసుకుంటే జీర్ణమైపోతుంది.. కానీ గొట్టం గోళీలకు ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థం, జీర్ణక్రియలో కరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిందితుల చీకటి వ్యాపారాన్ని పసిగట్టిన సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులు.. వారిపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

వారి దగ్గర నుంచి రూ.కోటీ 33 లక్షల విలువైన 303 గ్రాముల కొకైన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు కార్లు, ఐదు మొబైల్స్​ను సీజ్​ చేశారు. ఈ కేసులో నైజీరియన్ విక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్‌ గాబ్రియల్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ చీకటి వ్యాపారాన్ని మొత్తం వాట్సప్​ ద్వారా చేశారు. వాట్సప్​ చాటింగ్​ పరిశీలించగా.. కొంత మంది ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలిపారు. అవసరమైతే వినియోగదారులను అరెస్ట్ చేస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

"ఈ గ్యాంగ్​లో ఐదుగురు ఉన్నారు. ఈ ముఠాకు చింతా రాకేశ్ నాయకుడు. ఇతను ఇద్దరిని చేర్చుకుని గోవాలో నైజీరియన్స్​తో సరుకు ఎప్పటికప్పుడు తెచ్చుకుని హైదరాబాద్​లో అమ్మేవాడు. అక్కడ రూ.7 వేలకు కొని.. ఇక్కడ రూ.18 వేలకు అమ్ముతున్నాడు." - స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.