కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్ధతుగా పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. అయితే పీఎం కేర్స్ నిధికి ఇచ్చే విరాళాలకు మాత్రమే కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (సీఎస్ఆర్) కింద అర్హత ఉండగా... ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు ఆ వెసులుబాటు లేదు. ఇటీవల ప్రధానమంత్రి నిర్వహించిన దృశ్యామాధ్యమ సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధానికి రాసిన లేఖలోనూ పేర్కొన్నారు.
మార్చి 24వ తేదీ నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలన్నింటినీ కొవిడ్-19 నివారణ చర్యలు, సంబంధిత అవసరాలకు ఉపయోగించుకునేలా రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి జమ చేయనున్నట్టు తాజా ఆదేశాలు పేర్కొన్నాయి. దీనితో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చే విరాళాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులుగా పరిగణించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు