ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఇందుకోసం పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేశారని సీపీ అభినందించారు.
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వెస్ట్జోన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి ఓ ఫార్మా కంపెనీ అందజేసిన శానిటైజర్లు, మాస్కులను అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది సవాల్గా స్వీకరించి విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'