ETV Bharat / state

'దేశ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి'

author img

By

Published : Aug 15, 2020, 5:17 PM IST

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని గుడిమల్కపూర్ డివిజన్​లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ గంగపుత్ర... డివిజన్ ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయ జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర
జాతీయ జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం గుడిమల్కపూర్ డివిజన్​లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గంగపుత్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గుడిమల్కపూర్ డివిజన్​ ప్రజలకు కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

వర్షాన్ని లెక్కచేయకుండా...

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నా... డివిజన్ ప్రజలు కార్యక్రమానికి హాజరుకావడం దేశభక్తికి ప్రతీక అని కార్పొరేటర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని మతాల సమగ్రత, సౌభ్రాతృత్వమే భారతదేశానికి చిహ్నమని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్ర పోరాట యోధుల బాటలో డివిజన్ ప్రజలు నడవాలని ప్రకాశ్ సూచించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు శివరాత్రి రాముల, టీటీయూసీ నాయకులు తిరుమలేశ్, ఏరియా సభా సభ్యులు రావుల మహేందర్ సహా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం గుడిమల్కపూర్ డివిజన్​లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గంగపుత్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గుడిమల్కపూర్ డివిజన్​ ప్రజలకు కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

వర్షాన్ని లెక్కచేయకుండా...

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నా... డివిజన్ ప్రజలు కార్యక్రమానికి హాజరుకావడం దేశభక్తికి ప్రతీక అని కార్పొరేటర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని మతాల సమగ్రత, సౌభ్రాతృత్వమే భారతదేశానికి చిహ్నమని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్ర పోరాట యోధుల బాటలో డివిజన్ ప్రజలు నడవాలని ప్రకాశ్ సూచించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు శివరాత్రి రాముల, టీటీయూసీ నాయకులు తిరుమలేశ్, ఏరియా సభా సభ్యులు రావుల మహేందర్ సహా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.