ETV Bharat / state

పెరిగిపోతున్న కేసులు... వణుకుతున్న భాగ్యనగరవాసులు - corona cases updates

హైదరాబాద్​ నగర వాసులను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. వీళ్లూ.. వాళ్లని తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ ఆగమాగం చేస్తోంది. ఇవాళ ఒక్క రోజే యూసఫ్​గూడలో 79 మందికి కరోనా సోకిందంటే తీవ్రత ఎంతుందో తెలుసుకోవచ్చు. దీనికి తోడు వైద్యులు, పోలీసులను కూడా మహమ్మారి వదలకపోవటం మరింత ఆందోళన కలిగించే విషయం.

corona cases increasing in Hyderabad
పెరిగిపోతున్న కేసులు... వణుకుతున్న భాగ్యనగరవాసులు
author img

By

Published : Jun 25, 2020, 11:00 PM IST

Updated : Jun 26, 2020, 4:15 PM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చంచల్​గూడ ప్రభుత్వ ముద్రణాాలయంలో కరోనా కలవరం రేపింది. ముద్రణ కేంద్రంలో పనిచేస్తున్న ఆరుగురికి కరోనా సోకగా... కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇక మలక్​పేట ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా మరో ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. ఈ ఘటనతో 2 రోజుల పాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంలను మూసేశారు.

ఒక్క యూసఫ్​ గూడలోనే 79 మందికి...

ఇక యూసఫ్​గూడ సర్కిల్​లో గురువారం 79 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్టు అధికారులు ప్రకటించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి తాజాగా కరోనా బారినపడ్డారు. నాదర్​గుల్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా... అబ్దుల్లాపుర్​మెట్​కి చెందిన ఓ వైద్యుడి వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. గతంలోనే ఆ వైద్యుడు కరోనా భారిన పడగా... అనుమానంతో డ్రైవర్​కి పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. ఇంజాపూర్​లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కొవిడ్​ నిర్ధరణ అయింది. ఇప్పటి వరకు గ్రామంలో కరోనా బాారిన పడిన వారి సంఖ్య 9కి చేరింది.

పోలీసు సిబ్బందిలో కలవరం...

నాచారం పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్​కు, పహాడీషరీఫ్ పోలీస్​స్టేషన్​లో మరో మహిళా కానిస్టేబుల్​ కరోనా బారిన పడ్డారు. మీర్​పేట పోలీస్​స్టేషన్​లో ఇన్​స్పెక్టర్ సహా ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ కేసులతో ఇవాళ తాజాగా 8 మంది పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధరణ అయ్యింది.

బేగం బజార్​ వారం రోజులు బంద్​...

యాచారం మండలం నక్కగుట్ట తండాలో ఇద్దరికి కరోనా సోకింది. బోడుప్పల్​కి చెందిన మరో యువకుడు కరోనా బాారిన పడినట్టు అధికారులు తెలిపారు. మణికొండలో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్​లో కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ వారం రోజుల పాటు బేగంబజార్​ని మూసివేయాలని నిర్ణయించింది.

ఇవీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చంచల్​గూడ ప్రభుత్వ ముద్రణాాలయంలో కరోనా కలవరం రేపింది. ముద్రణ కేంద్రంలో పనిచేస్తున్న ఆరుగురికి కరోనా సోకగా... కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇక మలక్​పేట ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా మరో ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. ఈ ఘటనతో 2 రోజుల పాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంలను మూసేశారు.

ఒక్క యూసఫ్​ గూడలోనే 79 మందికి...

ఇక యూసఫ్​గూడ సర్కిల్​లో గురువారం 79 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్టు అధికారులు ప్రకటించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి తాజాగా కరోనా బారినపడ్డారు. నాదర్​గుల్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా... అబ్దుల్లాపుర్​మెట్​కి చెందిన ఓ వైద్యుడి వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. గతంలోనే ఆ వైద్యుడు కరోనా భారిన పడగా... అనుమానంతో డ్రైవర్​కి పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. ఇంజాపూర్​లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కొవిడ్​ నిర్ధరణ అయింది. ఇప్పటి వరకు గ్రామంలో కరోనా బాారిన పడిన వారి సంఖ్య 9కి చేరింది.

పోలీసు సిబ్బందిలో కలవరం...

నాచారం పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్​కు, పహాడీషరీఫ్ పోలీస్​స్టేషన్​లో మరో మహిళా కానిస్టేబుల్​ కరోనా బారిన పడ్డారు. మీర్​పేట పోలీస్​స్టేషన్​లో ఇన్​స్పెక్టర్ సహా ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ కేసులతో ఇవాళ తాజాగా 8 మంది పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధరణ అయ్యింది.

బేగం బజార్​ వారం రోజులు బంద్​...

యాచారం మండలం నక్కగుట్ట తండాలో ఇద్దరికి కరోనా సోకింది. బోడుప్పల్​కి చెందిన మరో యువకుడు కరోనా బాారిన పడినట్టు అధికారులు తెలిపారు. మణికొండలో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్​లో కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ వారం రోజుల పాటు బేగంబజార్​ని మూసివేయాలని నిర్ణయించింది.

ఇవీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

Last Updated : Jun 26, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.