ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు

author img

By

Published : Jul 30, 2021, 7:54 PM IST

రాష్ట్రంలో కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో తాజాగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 657 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,44,330కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,800కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 657 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,31,389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు కూడా తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మూడో వేవ్​ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆ రెండు టీకాలు కలిపి ఇస్తే కరోనా నుంచి రక్ష!'

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,44,330కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,800కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 657 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,31,389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు కూడా తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మూడో వేవ్​ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆ రెండు టీకాలు కలిపి ఇస్తే కరోనా నుంచి రక్ష!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.