ETV Bharat / state

జంటనగరాల్లో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం - Minister KT Rama Rao review meeting on 2bhk houses

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ ఏడాది చివరి నాటికి 85 వేల రెండు పడక గదుల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంటనగరాల్లోని 24 నియోజకవర్గాలకు నాలుగు వేల చొప్పున సూమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. రెండు పడక గదుల ఇళ్ల సముదాయాల్లో తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Construction of about one lakh houses for 24 constituencies
జంటనగరాల్లో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం
author img

By

Published : Aug 27, 2020, 4:57 AM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గ్రేటర్‌ హైదరాబాద్‌లో లబ్ధిదారులకు చేరే దశకు చేరుకుంది. జీహెచ్​ఎమ్​సీ పరిధిలో దాదాపు 85 వేల ఇళ్లు సిద్ధమవుతున్నాయి. మహా నగరంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్​ సమీక్షించారు. డిసెంబర్ నాటికి సుమారు 85 వేలకుపైగా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. అందులో 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు కాగా.. మరో 10 వేలు జనూరామ్​, వాంబే ఇళ్లు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. చాలా చోట్ల పనులు తుదిదశకు చేరాయని వెల్లడించారు. డిసెంబర్‌ నాటికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్లు నివేదించారు. తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కేటీఆర్​.. ఇళ్లను తొందరగా పేదలకు అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

10 శాతం స్థానిక కోటా

జీహెచ్​ఎమ్​సీ పరిధిలో 9 వేల 700 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్న కేటీఆర్​.. దేశంలో ఏ మెట్రో నగరంలోనూ ఇంత పెద్దఎత్తున పథకం అమలు కావడం లేదన్నారు. నగరంలో 24 నియోజకవర్గాల్లో 4 వేల చొప్పున లక్ష ఇళ్లు అందిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన లబ్దిదారుల పరిధి.. రూపొందించామన్నారు. ముందుగా ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని లబ్ధిదారుల జాబితాను అప్‌లోడ్‌ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 10 శాతం స్థానిక కోటాలో భాగంగా ఆయా జిల్లాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జీహెచ్​ఎమ్​సీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని... సింహభాగాన్ని ఈ ఏడాదే ప్రజలకు అందిస్తామని కేటీఆర్​ వెల్లడించారు.

కొన్ని చోట్ల పూర్తయ్యాయి

గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం మంజూరూ ఇచ్చింది. 40 మురికివాడల్లో 9,837 ఇళ్లు, 69 ఓపెన్ ప్లేస్‌లలో 90,163 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించింది. 7 ప్రాంతాల్లో కోర్టు కేసులతో 1,918 ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మల్లాపూర్‌లోని సింగం చెరువు తండాలో 176, ఎరుకల నాంచారమ్మ బస్తీలో 288 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అందించారు. కొల్లూరులో 15,660, రాంపల్లిలో 6,264, అహ్మద్‌గూడాలో 4,428, బోజగుట్టలో 1824, జియాగూడలో 840, ఫీర్జాదిగూడలో 2,200, మునగనూరులో 2,700 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. అందులో కొన్ని చోట్ల పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ బల్దియా నిర్మాణాల వేగాన్ని పెంచింది.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గ్రేటర్‌ హైదరాబాద్‌లో లబ్ధిదారులకు చేరే దశకు చేరుకుంది. జీహెచ్​ఎమ్​సీ పరిధిలో దాదాపు 85 వేల ఇళ్లు సిద్ధమవుతున్నాయి. మహా నగరంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్​ సమీక్షించారు. డిసెంబర్ నాటికి సుమారు 85 వేలకుపైగా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. అందులో 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు కాగా.. మరో 10 వేలు జనూరామ్​, వాంబే ఇళ్లు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. చాలా చోట్ల పనులు తుదిదశకు చేరాయని వెల్లడించారు. డిసెంబర్‌ నాటికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్లు నివేదించారు. తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కేటీఆర్​.. ఇళ్లను తొందరగా పేదలకు అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

10 శాతం స్థానిక కోటా

జీహెచ్​ఎమ్​సీ పరిధిలో 9 వేల 700 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్న కేటీఆర్​.. దేశంలో ఏ మెట్రో నగరంలోనూ ఇంత పెద్దఎత్తున పథకం అమలు కావడం లేదన్నారు. నగరంలో 24 నియోజకవర్గాల్లో 4 వేల చొప్పున లక్ష ఇళ్లు అందిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన లబ్దిదారుల పరిధి.. రూపొందించామన్నారు. ముందుగా ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని లబ్ధిదారుల జాబితాను అప్‌లోడ్‌ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 10 శాతం స్థానిక కోటాలో భాగంగా ఆయా జిల్లాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జీహెచ్​ఎమ్​సీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని... సింహభాగాన్ని ఈ ఏడాదే ప్రజలకు అందిస్తామని కేటీఆర్​ వెల్లడించారు.

కొన్ని చోట్ల పూర్తయ్యాయి

గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం మంజూరూ ఇచ్చింది. 40 మురికివాడల్లో 9,837 ఇళ్లు, 69 ఓపెన్ ప్లేస్‌లలో 90,163 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించింది. 7 ప్రాంతాల్లో కోర్టు కేసులతో 1,918 ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మల్లాపూర్‌లోని సింగం చెరువు తండాలో 176, ఎరుకల నాంచారమ్మ బస్తీలో 288 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అందించారు. కొల్లూరులో 15,660, రాంపల్లిలో 6,264, అహ్మద్‌గూడాలో 4,428, బోజగుట్టలో 1824, జియాగూడలో 840, ఫీర్జాదిగూడలో 2,200, మునగనూరులో 2,700 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. అందులో కొన్ని చోట్ల పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ బల్దియా నిర్మాణాల వేగాన్ని పెంచింది.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.