MLA Sridhar Babu spoke in assembly meeting: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లల్లో రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరుగు పేరుతో క్వింటాల్కు 8 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన రైతు సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణలో ఈ ఏడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. గత ఎన్నికల ముందు చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైందని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వీరి అందరికీ ఎప్పుడు నిరుద్యోగభృతి ఇస్తారో తెలపాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని వెల్లడించారు.
వైద్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ మాట ఏమైందన్నారు. 108 అంబులెన్స్ సేవలను కూడా ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాళేశ్వరం వల్ల కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో చెప్పాలని కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. సర్పంచులు ఆత్మహత్యలు, ఆందోళనలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు ఉంటుందన్నారు. అసలు వారికి నిధులిచ్చే ఆలోచన ఉందా అని ఎమ్మెల్యే శ్రీధర్బాబు పలు ప్రశ్నలు సంధించారు.
"రాష్ట్రవ్యాప్తంగా 107 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మోసం చేస్తున్నారు. క్వింటాకు 8కేజీలు చొప్పున పక్కన పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఏమైంది. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్నారు. ఆ హామీ ఏమైంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందుతోంది. అసలు కాళేశ్వరం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు. సర్పంచుల నిధుల్లో స్పష్టత లేదు." - శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: