ప్రధాన మంత్రి రిలీఫ్ ప్యాకేజి కింద అర్హులకు రావాల్సిన 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు రాష్ట్ర ప్రజలకు అందలేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కేంద్ర సాయంతో కలిపి 12కిలోలు బియ్యం ఇస్తామని ఈ నెల 19న సీఎం కేసీఆర్ చెప్పినా... ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదన్నారు. తెలంగాణ సీఎం ప్రకటన నేపథ్యంలో పీఎం రిలీఫ్ ప్యాకేజీ అందే అవకాశాల్లేవని భావించవచ్చా... అని కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ ఓ లేఖను కిషన్రెడ్డికి మెయిల్ ద్వారా పంపినట్లు శశిధర్రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ లేఖ