ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు అందని పీఎం రిలీఫ్​ ప్యాకేజీ : మర్రి శశిధర్​ రెడ్డి - పీఎం రిలీఫ్​ ప్యాకేజీ మర్రి శశిధర్​ రెడ్డి

కేంద్రం ప్రకటించిన పీఎం రిలీఫ్‌ ప్యాకేజి నుంచి తెలంగాణ ప్రజలకు ఎలాంటి సాయం అందలేదని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి తెలిపారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డికి ఆయన లేఖ రాశారు.

మర్రి శశిధర్​ రెడ్డి
మర్రి శశిధర్​ రెడ్డి
author img

By

Published : Apr 24, 2020, 4:59 AM IST

ప్రధాన మంత్రి రిలీఫ్‌ ప్యాకేజి కింద అర్హులకు రావాల్సిన 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు రాష్ట్ర ప్రజలకు అందలేదని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి అన్నారు. కేంద్ర సాయంతో కలిపి 12కిలోలు బియ్యం ఇస్తామని ఈ నెల 19న సీఎం కేసీఆర్‌ చెప్పినా... ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదన్నారు. తెలంగాణ సీఎం ప్రకటన నేపథ్యంలో పీఎం రిలీఫ్​ ప్యాకేజీ అందే అవకాశాల్లేవని భావించవచ్చా... అని కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ ఓ లేఖను కిషన్​రెడ్డికి మెయిల్‌ ద్వారా పంపినట్లు శశిధర్​రెడ్డి వివరించారు.

ప్రధాన మంత్రి రిలీఫ్‌ ప్యాకేజి కింద అర్హులకు రావాల్సిన 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు రాష్ట్ర ప్రజలకు అందలేదని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి అన్నారు. కేంద్ర సాయంతో కలిపి 12కిలోలు బియ్యం ఇస్తామని ఈ నెల 19న సీఎం కేసీఆర్‌ చెప్పినా... ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదన్నారు. తెలంగాణ సీఎం ప్రకటన నేపథ్యంలో పీఎం రిలీఫ్​ ప్యాకేజీ అందే అవకాశాల్లేవని భావించవచ్చా... అని కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ ఓ లేఖను కిషన్​రెడ్డికి మెయిల్‌ ద్వారా పంపినట్లు శశిధర్​రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.