ETV Bharat / state

రాజ్​భవన్​లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ - రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Congress CM Oath Arrangements in Raj Bhavan : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌ ముస్తాబవుతోంది. ఇందుకోసం రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Congress CM Oath Arrangements in Raj Bhavan
Congress CM Oath Arrangements
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 4:43 PM IST

Updated : Dec 4, 2023, 5:24 PM IST

Congress CM Oath Arrangements in Raj Bhavan : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌ ముస్తాబవుతోంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్​భవన్​లో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం ప్రమాణస్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, షామియానా, సహా ఇతరత్రా సామాగ్రి తరలిస్తున్నారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ (GHMC) సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.

Arrangements For New CM Oath at Raj Bhavan : అటు కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసే ప్రక్రియ ఆలస్యం అయింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Telangana CEO Vikas Raj) గవర్నర్​ను కలవడం మధ్యాహ్ననికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సీఈవో ఉదయం 11.30 గంటలకు గవర్నర్​ను కలవాల్సి ఉంది. అయితే గెజిట్ జారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు దిల్లీ నుంచి ఈసీ సీనియర్ అధికారులు రావడం ఆలస్యమైంది.

తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీల్లో గెలిచిన 'త్రిమూర్తులు'

కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రధాన కార్యదర్శి అవినాశ్​ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంది. వీరితో కలిసి సీఈవో వికాస్ రాజ్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. ఎన్నికలకు సంబంధించిన నివేదిక ఇవ్వడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్​ను అందించారు. దీంతో రెండో శాసనసభను గవర్నర్‌ రద్దు చేయడంతో పాటు, మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణస్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవుతుంది.

Congress CM Oath Arrangements in Raj Bhavan
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

Congress CM Oath Ceremony Arrangements in Raj Bhavan : ఈసీ బృందం కలిసిన అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్​ను కలవనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్​కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. వీలైనంత వరకు ఈ సాయంత్రమే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Arrangements for Taking Oath of CM at Raj Bhavan : మొదటగా డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, గెలిచిన సీట్ల సంఖ్యతో యాక్షన్ ప్లాన్ మార్చుకుంది. దీనికి తోడు నార్త్ ఇండియాలోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో, తెలంగాణలో గెలిచిన సీట్ల పరిశీలించిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రమాణస్వీకారానికి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ క్రమంలోనే రాజ్​భవన్​లో ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో తక్కువగా బలం

గెలిచిన అభ్యర్థుల సంబురాలు - పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీలు

Congress CM Oath Arrangements in Raj Bhavan : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌ ముస్తాబవుతోంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్​భవన్​లో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం ప్రమాణస్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, షామియానా, సహా ఇతరత్రా సామాగ్రి తరలిస్తున్నారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ (GHMC) సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.

Arrangements For New CM Oath at Raj Bhavan : అటు కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసే ప్రక్రియ ఆలస్యం అయింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Telangana CEO Vikas Raj) గవర్నర్​ను కలవడం మధ్యాహ్ననికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సీఈవో ఉదయం 11.30 గంటలకు గవర్నర్​ను కలవాల్సి ఉంది. అయితే గెజిట్ జారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు దిల్లీ నుంచి ఈసీ సీనియర్ అధికారులు రావడం ఆలస్యమైంది.

తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీల్లో గెలిచిన 'త్రిమూర్తులు'

కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రధాన కార్యదర్శి అవినాశ్​ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంది. వీరితో కలిసి సీఈవో వికాస్ రాజ్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. ఎన్నికలకు సంబంధించిన నివేదిక ఇవ్వడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్​ను అందించారు. దీంతో రెండో శాసనసభను గవర్నర్‌ రద్దు చేయడంతో పాటు, మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణస్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవుతుంది.

Congress CM Oath Arrangements in Raj Bhavan
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

Congress CM Oath Ceremony Arrangements in Raj Bhavan : ఈసీ బృందం కలిసిన అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్​ను కలవనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్​కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. వీలైనంత వరకు ఈ సాయంత్రమే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Arrangements for Taking Oath of CM at Raj Bhavan : మొదటగా డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, గెలిచిన సీట్ల సంఖ్యతో యాక్షన్ ప్లాన్ మార్చుకుంది. దీనికి తోడు నార్త్ ఇండియాలోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో, తెలంగాణలో గెలిచిన సీట్ల పరిశీలించిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రమాణస్వీకారానికి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ క్రమంలోనే రాజ్​భవన్​లో ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో తక్కువగా బలం

గెలిచిన అభ్యర్థుల సంబురాలు - పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీలు

Last Updated : Dec 4, 2023, 5:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.