ETV Bharat / state

హోంమంత్రి సమక్షంలో తెరాసలో చేరిన హస్తం నేతలు

హైదరాబాద్ గన్ ఫౌండ్రిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్​ హాల్​లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మహమూద్ అలీ తెరాస అందరి పార్టీ అని ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jul 6, 2019, 11:12 PM IST

తెరాసలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలు, మతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారని వివరించారు. గతంలో పండుగలు వచ్చాయంటే కర్ఫ్యూలతో ప్రజలు భయాందోళనకు గురయ్యేవారని అన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెరాసలో తీర్థం పుచ్చుకున్నారు.

గన్ ఫౌండ్రిలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇవీ చూడండి : మేడిగడ్డ నుంచి అన్నారంకు నీటి విడుదల

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలు, మతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారని వివరించారు. గతంలో పండుగలు వచ్చాయంటే కర్ఫ్యూలతో ప్రజలు భయాందోళనకు గురయ్యేవారని అన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెరాసలో తీర్థం పుచ్చుకున్నారు.

గన్ ఫౌండ్రిలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇవీ చూడండి : మేడిగడ్డ నుంచి అన్నారంకు నీటి విడుదల

TG-HYD-54-06-EX-SERVICEMANS-LAND-ISSUE-AB-TS10021 తమ భూములను కాపాడాలంటూ మాజీ సైనిక అధికారులు ఆందోళన బొరబండ అల్లాపూర్ డివిజన్లోని సర్వే నెంబర్ ,1007,లో మాజీ సైనిక అధికారుల ఇళ్లను కూల్చివేసిన కూకట్పల్లి జిహెచ్ఎంసి అధికారులు . సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న జిహెచ్ఎంసి అధికారులు అధికార పార్టీ నేత అధికారులపై ఒత్తిడి తేవడంతో తమ ఇళ్లను కూలగొట్టారు అంటూ ఆందోళన ... బొరబండ అల్లాపూర్ డివిజన్లోని భాగ్యనగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ 1961లో రిజిస్ట్రేషన్ అయిందని ,తాము విధి నిర్వహణలో ఉన్నప్పుడు కొంత కొంత డబ్బు దాచుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత భాగ్యనగర్ సొసైటీలో ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు తీసుకుని భూములు ఉన్నామని, అయితే ఇప్పుడు అధికార పార్టీ నేత తమ భూములపై కన్నేసి అధికారులతో చేతులు కలిపి ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ సైనిక అధికారి రాజా ఉమ్మారెడ్డి ఆరోపించారు ..తాము ప్రభుత్వ అనుమతులు తోనే ఈ భూములను కొనమని అయితే అధికార పార్టీకి చెందిన నేతలు తమ ఇళ్ల స్థలాల పై కన్ను వేసి అధికారులతో కుమ్మక్కై తమ భూములను కాజేయటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు అయితే శనివారం ఉదయం జిహెచ్ఎంసి అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా తమ సొసైటీ భూముల్లో ప్రవేశించి తమ కట్టడాలను కూల్చివేయడం చాలా దారుణం అన్నారు ఈ విషయంపై తాము పెద్ద ఎత్తున ఆందోళన న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.