కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు కాచిగూడలో ఈనెల 23న సదస్సును నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ప్రకటించారు. ప్రజలకు మొదట కరోనా వ్యాధిపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి వైద్యులు వసంత కుమార్, శ్యాంసుందర్లు కొవిడ్ సూచనలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, తీన్మార్ మల్లన్న, ఇతర నేతలు పాల్గొంటారని చెప్పారు.
ఇదీ చూడండి : డియర్ ఆర్సీబీ.. కోహ్లీ ఎక్కడ?