ETV Bharat / state

D.RAJA: 'తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలి' - తెలంగాణ తాజా వార్తలు

తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. అఫ్ఘాన్​లో పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

communist
D.RAJA: 'తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలి'
author img

By

Published : Aug 18, 2021, 3:17 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్​లో పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్​లో డి.రాజా ఇవాళ మాట్లాడారు.

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యత కనబడిందని రాజా తెలిపారు. ఇప్పటికే శరత్​పవార్, కపిల్​ సిబాల్​ ప్రతిపక్షాల ఐక్యతపై సమావేశమయ్యారని పేర్కొన్నారు. ఈనెల 20న సోనియాగాంధీ నివాసంలో ప్రతిపక్షాల సమావేశంలో ఐక్యతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు.

అఫ్గానిస్థాన్​లో కాబుల్​ను తాలిబన్లు వశపరుచుకున్నారు. తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలి. భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే శరత్​పవార్, కపిల్​ సిబాల్​ ప్రతిపక్షాల ఐక్యతపై భేటీ అయ్యారు.

- డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి

ఉగ్రవాద తండాలకు వెన్నుదన్నుగా నిలిచిన తాలిబన్ల చేతులకే అఫ్గానిస్థాన్‌ చిక్కింది. ఇరవై ఏళ్లు అమెరికా కనుసన్నల్లో నెట్టుకొచ్చిన అఫ్గాన్ ప్రజా ప్రభుత్వం చేతులెత్తేసింది. అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పలాయనంతో తాలిబన్లు ఏకపక్ష విజయం సాధించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం సరిహద్దులు దాటేందుకు నరకం చవిచూస్తున్నారు. ప్రపంచం గుండెల్లో ఉగ్రబాంబులై పేలిన తాలిబన్‌ చరిత్రను తలుచుకుని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడుతోంది.

ఇవీ చదవండి:

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్​లో పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్​లో డి.రాజా ఇవాళ మాట్లాడారు.

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యత కనబడిందని రాజా తెలిపారు. ఇప్పటికే శరత్​పవార్, కపిల్​ సిబాల్​ ప్రతిపక్షాల ఐక్యతపై సమావేశమయ్యారని పేర్కొన్నారు. ఈనెల 20న సోనియాగాంధీ నివాసంలో ప్రతిపక్షాల సమావేశంలో ఐక్యతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు.

అఫ్గానిస్థాన్​లో కాబుల్​ను తాలిబన్లు వశపరుచుకున్నారు. తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలి. భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే శరత్​పవార్, కపిల్​ సిబాల్​ ప్రతిపక్షాల ఐక్యతపై భేటీ అయ్యారు.

- డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి

ఉగ్రవాద తండాలకు వెన్నుదన్నుగా నిలిచిన తాలిబన్ల చేతులకే అఫ్గానిస్థాన్‌ చిక్కింది. ఇరవై ఏళ్లు అమెరికా కనుసన్నల్లో నెట్టుకొచ్చిన అఫ్గాన్ ప్రజా ప్రభుత్వం చేతులెత్తేసింది. అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పలాయనంతో తాలిబన్లు ఏకపక్ష విజయం సాధించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం సరిహద్దులు దాటేందుకు నరకం చవిచూస్తున్నారు. ప్రపంచం గుండెల్లో ఉగ్రబాంబులై పేలిన తాలిబన్‌ చరిత్రను తలుచుకుని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.