జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించడానికి కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్గా మర్రి శశిధర్రెడ్డి, కన్వీనర్గా దాసోజు శ్రవణ్కుమార్ ఉంటారు. వీరితో పాటు కోదండరెడ్డి, శ్యాంమోహన్, అంజన్కుమార్ యాదవ్, నిరంజన్, కేతూరి వెంకటేష్, వెంకట్ గురిజాల, మొగిళ్ల రాజిరెడ్డిలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నవంబర్ 21 లోపు 500 పేజీల ప్రజల మేనిఫెస్టేను రూపొందిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో రూపొందించిన రెండు రోజులకు కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యులు మణికం ఠాగూర్ విడుదల చేస్తారని ఉత్తమ్ పేర్కొన్నారు.
నలుగురు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు పనిని విభజించడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించి.. వాటిని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తమ్ వివరించారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు | పార్లమెంట్ నియోజకవర్గాల కేటాయింపు |
రేవంత్రెడ్డి | ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ), కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్ (ఎస్టీ) |
పొన్నం ప్రభాకర్ | మెదక్, మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల, ఖమ్మం |
కుసుమకుమార్ | మహబూబ్నగర్, నాగర్కర్నూలు(ఎస్సీ), నల్గొండ, భువనగిరి, వరంగల్(ఎస్సీ) |
మహ్మద్ అజారుద్దీన్ | అన్ని ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్, సేవాలాల్ విభాగాలతో పాటు మహిళా, కిసాన్సెల్, మిగతా డిపార్ట్మెంట్లు |
ఇదీ చదవండిః ఖాతాలోని నగదు తీయాలంటే.. కాసులు చెల్లించాల్సిందే!