భాజపా నాయకులు భాగ్యలక్ష్మి గుడికి వెళ్తే, తెరాస నాయకులు నల్లపోచమ్మ గుడిని కూల్చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నాయకత్వాన్ని తయారు చేసుకోలేని భాజపా తమ నాయకులను ఆకర్షిస్తోందని మండిపడ్డారు.
బయటి పార్టీల నాయకులను తీసుకుని ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. మహావృక్షం లాంటి కాంగ్రెస్ను బలహీనపరిచినా ఎలాంటి నష్టం ఉండదన్నారు. పరికికంప లాంటి భాజపాను మాత్రం ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించారు. 20 ఏళ్లుగా కర్ఫ్యూ లేని హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ కర్ఫ్యూ కావాలా అని అడగడంలో అర్థం లేదని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.