ETV Bharat / state

ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలి: సీఎం కేసీఆర్

సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలని.. ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మాన్యువల్ రూపొందించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం.. మే నెలాఖరుకు పూర్తి చేసి.. కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని కేసీఆర్​ సూచించారు.

author img

By

Published : May 17, 2020, 11:52 PM IST

సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ కిందికి రావాలి: సీఎం కేసీఆర్​
సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ కిందికి రావాలి: సీఎం కేసీఆర్​

వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్​లు ఏర్పాటు చేయాలని.. నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

3 రోజుల్లో సమావేశం కావాలి

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత పరిస్థితిని, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే విషయాలపై సీఎం ఆరా తీశారు. చెరువులకు నీరు అందించడానికున్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమావేశం కావాలని ఆదేశించారు. చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని.. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుందన్నారు. చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని.. అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని పేర్కొన్నారు.

"ఈ వర్ష కాలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్ఆర్ఎస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి. ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా? సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా? అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి."

-సీఎం కేసీఆర్​

దేవాదులకు 365 రోజులు నీటిని లిఫ్ట్​ చేయాలి

తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలని సీఎం స్పష్టం చేశారు. గౌరవల్లి లిఫ్టు పనులు వెంటనే పూర్తి చేసి, ఈ సీజన్ లోనే నీళ్లు అందించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలన్నారు. సమ్మక్క బారేజ్ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలని చెప్పారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని... వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ ద్వారా తపాస్​పల్లి రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్​రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలన్నారు.

ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకి రావాలి

భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుదల, ఇరిగేషన్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్నీ నీటి పారుదల శాఖ పరిధిలోనే ఉండాలన్నారు. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటి పారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలని.. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుందన్నారు. సీఈ రూ.50 లక్షల వరకు ఎస్ఈ రూ.25 లక్షల వరకు, ఈఈ రూ.5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వవచ్చన్నారు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతమున్న గేజ్​లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని.. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్​లు సరిగా చూపెట్టడం లేదన్నారు. కొత్తగా గేజ్​లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలని కేసీఆర్​ సూచించారు.

"ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ఇతరులు ఆక్రమిస్తున్నారు. వాటిపై సీరియస్​గా ఉండాలి. సేకరించిన భూమిని నీటి పారుదల శాఖ పేరు మీద మ్యుటేషన్ చేయాలి. రాష్ట్రంలో చాలా చోట్ల.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాల్వ కట్టలపై నిర్మాణాలు వచ్చాయి. ఇది నేరమే కాకుండా, ప్రమాదకరం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కాలువల్లో నీరు వస్తాయి కాబట్టి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాలువలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేయాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి."

-సీఎం కేసీఆర్​

క్రమం తప్పకుండా నిధుల విడుదల

ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించామని.. వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్ ఎం మాన్యువల్ రూపొందించాలన్నారు. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి.. క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఇంకా ఎక్కడైనా ఏమైనా భూసేకరణ మిగిలి ఉంటే, తక్షణం పూర్తి చేయాలని సూచించారు. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు!

వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్​లు ఏర్పాటు చేయాలని.. నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

3 రోజుల్లో సమావేశం కావాలి

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత పరిస్థితిని, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే విషయాలపై సీఎం ఆరా తీశారు. చెరువులకు నీరు అందించడానికున్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమావేశం కావాలని ఆదేశించారు. చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని.. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుందన్నారు. చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని.. అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని పేర్కొన్నారు.

"ఈ వర్ష కాలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్ఆర్ఎస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి. ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా? సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా? అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి."

-సీఎం కేసీఆర్​

దేవాదులకు 365 రోజులు నీటిని లిఫ్ట్​ చేయాలి

తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలని సీఎం స్పష్టం చేశారు. గౌరవల్లి లిఫ్టు పనులు వెంటనే పూర్తి చేసి, ఈ సీజన్ లోనే నీళ్లు అందించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలన్నారు. సమ్మక్క బారేజ్ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలని చెప్పారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని... వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ ద్వారా తపాస్​పల్లి రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్​రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలన్నారు.

ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకి రావాలి

భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుదల, ఇరిగేషన్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్నీ నీటి పారుదల శాఖ పరిధిలోనే ఉండాలన్నారు. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటి పారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలని.. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుందన్నారు. సీఈ రూ.50 లక్షల వరకు ఎస్ఈ రూ.25 లక్షల వరకు, ఈఈ రూ.5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వవచ్చన్నారు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతమున్న గేజ్​లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని.. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్​లు సరిగా చూపెట్టడం లేదన్నారు. కొత్తగా గేజ్​లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలని కేసీఆర్​ సూచించారు.

"ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ఇతరులు ఆక్రమిస్తున్నారు. వాటిపై సీరియస్​గా ఉండాలి. సేకరించిన భూమిని నీటి పారుదల శాఖ పేరు మీద మ్యుటేషన్ చేయాలి. రాష్ట్రంలో చాలా చోట్ల.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాల్వ కట్టలపై నిర్మాణాలు వచ్చాయి. ఇది నేరమే కాకుండా, ప్రమాదకరం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కాలువల్లో నీరు వస్తాయి కాబట్టి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాలువలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేయాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి."

-సీఎం కేసీఆర్​

క్రమం తప్పకుండా నిధుల విడుదల

ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించామని.. వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్ ఎం మాన్యువల్ రూపొందించాలన్నారు. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి.. క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఇంకా ఎక్కడైనా ఏమైనా భూసేకరణ మిగిలి ఉంటే, తక్షణం పూర్తి చేయాలని సూచించారు. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.