ETV Bharat / state

Ramadan 2023: ముస్లింలకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు.. నేడు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

author img

By

Published : Apr 22, 2023, 9:59 AM IST

Ramadan 2023 Celebrations In Hyderabad: రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్​ ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్​ ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవభక్తి పరిఢవిల్లుతుందని సీఎం అన్నారు. ప్రార్థన స్థలాల వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు కూడా విధించారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.

Ramadan
Ramadan

Ramadan 2023 Celebrations In Hyderabad: రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రాష్ట్ర గవర్నర్​ తమిళిసై ఈద్​- ఉల్​ - ఫితర్​ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్​ బోధనలు సమాజాన్ని తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్​ కూడా రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్​ ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవభక్తి పరిఢవిల్లుతోందని అన్నారు. ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో.. ఈద్​- ఉల్​ - ఫితర్​ జరుపుకోవాలని సూచించారు.

KCR Wishes on Ramadan : అల్లా దీవెనలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలం అని వ్యాఖ్యానించారు. లౌకికవాదం, మత సామరస్యం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కూడా ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు.

భద్రతా వలయంలో ప్రార్థనా మందిరాలు: ఇవాళ రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక సామూహిక ప్రార్ధనలకు భాగ్యనగరం సర్వం సిద్దమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జంటనగరాల్లోని ముస్లిం సోదరులు పలు మసీదుల్లో, ఈద్గాల వద్ద భారీ సంఖ్యలో ప్రార్ధనలు నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్‌, మాసబ్‌ట్యాంక్‌ హాకీ మైదానం, సికింద్రాబాద్‌, రాణిగంజ్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రార్ధనలు జరిగే సమయం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ట్రాఫిక్​ ఆంక్షల నడుమ మహా నగరం: పవిత్ర రంజాన్‌ పండుగ నేపథ్యంలో జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్ధనల కోసం పురానాపూల్‌, కిషన్‌బాగ్‌ మీదగా మిరాలం ఈద్గాకు వాహనాల పై వచ్చే వారిని బహదుర్‌పుర కూడలి మీదగా అనుమతిస్తున్నారు. కాలాపత్తర్‌ మీదగా మిరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా పంపిస్తున్నారు. పురానపూల్‌ మీదగా బహదుర్‌పుర వైపు వచ్చే వాహనాలను పురానాపూల్‌ దర్వాజ, జియాగూడ సిటీ కళాశాల మీదగా మళ్లిస్తున్నారు. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి మీదగా బహదుర్‌పుర వైపు వచ్చే వాహనాలను ఆరామ్‌ఘర్‌ చౌరస్తా నుంచి పంపిస్తున్నారు. ప్రార్ధనలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.

ట్రాఫిక్​ సమస్యపై ఫిర్యాదుకు హెల్ప్​లైన్​ నంబర్​:​ వాహనదారులు పోలీసుల విధించిన ఆంక్షలు పాటించి.. తమకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. ట్రాఫిక్‌ సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్​ 9010203626 కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

ఇవీ చదవండి:

Ramadan 2023 Celebrations In Hyderabad: రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రాష్ట్ర గవర్నర్​ తమిళిసై ఈద్​- ఉల్​ - ఫితర్​ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్​ బోధనలు సమాజాన్ని తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్​ కూడా రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్​ ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవభక్తి పరిఢవిల్లుతోందని అన్నారు. ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో.. ఈద్​- ఉల్​ - ఫితర్​ జరుపుకోవాలని సూచించారు.

KCR Wishes on Ramadan : అల్లా దీవెనలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలం అని వ్యాఖ్యానించారు. లౌకికవాదం, మత సామరస్యం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కూడా ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు.

భద్రతా వలయంలో ప్రార్థనా మందిరాలు: ఇవాళ రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక సామూహిక ప్రార్ధనలకు భాగ్యనగరం సర్వం సిద్దమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జంటనగరాల్లోని ముస్లిం సోదరులు పలు మసీదుల్లో, ఈద్గాల వద్ద భారీ సంఖ్యలో ప్రార్ధనలు నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్‌, మాసబ్‌ట్యాంక్‌ హాకీ మైదానం, సికింద్రాబాద్‌, రాణిగంజ్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రార్ధనలు జరిగే సమయం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ట్రాఫిక్​ ఆంక్షల నడుమ మహా నగరం: పవిత్ర రంజాన్‌ పండుగ నేపథ్యంలో జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్ధనల కోసం పురానాపూల్‌, కిషన్‌బాగ్‌ మీదగా మిరాలం ఈద్గాకు వాహనాల పై వచ్చే వారిని బహదుర్‌పుర కూడలి మీదగా అనుమతిస్తున్నారు. కాలాపత్తర్‌ మీదగా మిరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా పంపిస్తున్నారు. పురానపూల్‌ మీదగా బహదుర్‌పుర వైపు వచ్చే వాహనాలను పురానాపూల్‌ దర్వాజ, జియాగూడ సిటీ కళాశాల మీదగా మళ్లిస్తున్నారు. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి మీదగా బహదుర్‌పుర వైపు వచ్చే వాహనాలను ఆరామ్‌ఘర్‌ చౌరస్తా నుంచి పంపిస్తున్నారు. ప్రార్ధనలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.

ట్రాఫిక్​ సమస్యపై ఫిర్యాదుకు హెల్ప్​లైన్​ నంబర్​:​ వాహనదారులు పోలీసుల విధించిన ఆంక్షలు పాటించి.. తమకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. ట్రాఫిక్‌ సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్​ 9010203626 కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.