రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. చిన్నపిల్లలు తాగే పాలు కూడా కల్తీ జరగటం విచారకరం సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల వల్ల రైతులకు లాభాలతో పాటు, ఆహార కల్తీని నిరోధించవచ్చని సూచించారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంపును కూడా పరిశీలిస్తున్నామని ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్