ETV Bharat / state

'ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు' - ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్​ నిరసన దీక్ష

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం తుది దశలో ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్ష చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ... నిరసన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు చెబుతున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

clp leader bhatti vikramarka comment on those projects in telangana
'ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు'
author img

By

Published : Jun 2, 2020, 7:13 AM IST

Updated : Jun 2, 2020, 8:04 AM IST

'ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు'

కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అవి ఇప్పటికే 80 నుంచి 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.

ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే..

చివరి దశకు చేరిన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు రూ. 42 వేల కోట్లు అవసరమన్నారు. పాత, కొత్త ప్రాజెక్టులు పూర్తిచేయక ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తోందని పేర్కొన్నారు. కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలకే నష్టమన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తికాకపోతే కలిగే నష్టాలను తెలిపేందుకే నిరసన దీక్ష అని వెల్లడించారు.

ఇదీ చూడండి : ఐటీ ఎగుమతుల్లో తెలంగాణకు లేదు పోటీ!

'ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు'

కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అవి ఇప్పటికే 80 నుంచి 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.

ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే..

చివరి దశకు చేరిన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు రూ. 42 వేల కోట్లు అవసరమన్నారు. పాత, కొత్త ప్రాజెక్టులు పూర్తిచేయక ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తోందని పేర్కొన్నారు. కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలకే నష్టమన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తికాకపోతే కలిగే నష్టాలను తెలిపేందుకే నిరసన దీక్ష అని వెల్లడించారు.

ఇదీ చూడండి : ఐటీ ఎగుమతుల్లో తెలంగాణకు లేదు పోటీ!

Last Updated : Jun 2, 2020, 8:04 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.