ETV Bharat / state

మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

author img

By

Published : Feb 17, 2020, 8:37 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా పౌరసరఫరా శాఖ, హైదరాబాద్​ మెట్రో రైలు ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. పౌర సరఫరాల శాఖ అధికారులు, మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మెుక్కలు నాటారు.

civil supply officers and metro md nvs reddy to celebrate KCR birthday with massive plantation drive in hyderabad
మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులతో పాటు ఐఏఎస్​లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో...

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది, రైస్ మిల్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 66వ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 66 వేల మొక్కలు నాటడమే కాకుండా పూర్తి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్ ఆవరణలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ పి.సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు మొక్కలు నాటారు.

హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో...

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ 50 వేలకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఉప్పల్ మెట్రో రైలు డిపోలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు కారిడార్లలోని మెట్రో స్టేషన్ల కింద, ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలు... గొల్లూరు, తుర్కయాంజాల్​లోని అటవీ ప్రాంతంలోను హైదరాబాద్ మెట్రో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సాయంత్రం వరకు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తవుతుందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులతో పాటు ఐఏఎస్​లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో...

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది, రైస్ మిల్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 66వ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 66 వేల మొక్కలు నాటడమే కాకుండా పూర్తి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్ ఆవరణలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ పి.సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు మొక్కలు నాటారు.

హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో...

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ 50 వేలకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఉప్పల్ మెట్రో రైలు డిపోలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు కారిడార్లలోని మెట్రో స్టేషన్ల కింద, ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలు... గొల్లూరు, తుర్కయాంజాల్​లోని అటవీ ప్రాంతంలోను హైదరాబాద్ మెట్రో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సాయంత్రం వరకు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తవుతుందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.