ETV Bharat / state

తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు: సుచిత్ర ఎల్లా

author img

By

Published : Mar 7, 2023, 2:54 PM IST

CII Telangana Annual Conference: తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని భారత బయోటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్​లో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ వార్షిక సమావేశాలనికి మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు.

CII Telangana
CII Telangana

CII Telangana Annual Conference: రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భారత బయోటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఐటీసీ కాకతీయలో జరుగుతున్న భారతీయ పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశం జరిగింది. ఈ వార్షిక సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత్​ బయెటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దీనిలో ప్రభుత్వం కృషి ఎంతో ఉందని చెప్పారు. వీటితో పాటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు కూడా చాలా బాగున్నాయని పేర్కొన్నారు. టీఎస్​ ఐపాస్ ద్వారా సెల్ఫ్​ సర్టిఫికేషన్​ విధానం.. తనకు చాలా నచ్చిందని మెచ్చుకున్నారు.

యువతలో దాగిన ఉన్న ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన టీహబ్​ ఒక మంచి ఆలోచన అని కీర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. పెద్ద ఎత్తున హరితహారం పేరుతో మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సుచిత్ర ఎల్లా వ్యాఖ్యానించారు. పునరుత్పాదక శక్తి రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో ఏ మూలల విదేశీ కంపెనీలు పెట్టాలన్నా దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉండడం శుభసూచికమే అని హర్షం వ్యక్తం చేశారు.

"రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కూడా చాలా బాగుంది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం చాలా బాగుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్‌ మంచి ఆలోచన. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు. పునరుత్పాదకశక్తి రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉండటం హర్షణీయం." - సుచిత్ర ఎల్లా, భారత్​ బయోటెక్​ ఎండీ

ఏపీ గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సదస్సులో సుచిత్ర ఎల్లా ప్రసంగం: మరోవైపు గత వారం ఏపీలో జరిగిన జీఐఎస్​ 2023 సదస్సులో భారత బయోటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ..ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుందని హామీ ఇస్తూనే.. ఇక్కడి అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంతో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ చాలా అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీ గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సదస్సులో మరిన్ని విషయాలను ఆమె వివరించారు.

ఇవీ చదవండి:

CII Telangana Annual Conference: రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భారత బయోటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఐటీసీ కాకతీయలో జరుగుతున్న భారతీయ పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశం జరిగింది. ఈ వార్షిక సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత్​ బయెటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దీనిలో ప్రభుత్వం కృషి ఎంతో ఉందని చెప్పారు. వీటితో పాటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు కూడా చాలా బాగున్నాయని పేర్కొన్నారు. టీఎస్​ ఐపాస్ ద్వారా సెల్ఫ్​ సర్టిఫికేషన్​ విధానం.. తనకు చాలా నచ్చిందని మెచ్చుకున్నారు.

యువతలో దాగిన ఉన్న ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన టీహబ్​ ఒక మంచి ఆలోచన అని కీర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. పెద్ద ఎత్తున హరితహారం పేరుతో మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సుచిత్ర ఎల్లా వ్యాఖ్యానించారు. పునరుత్పాదక శక్తి రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో ఏ మూలల విదేశీ కంపెనీలు పెట్టాలన్నా దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉండడం శుభసూచికమే అని హర్షం వ్యక్తం చేశారు.

"రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కూడా చాలా బాగుంది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం చాలా బాగుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్‌ మంచి ఆలోచన. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు. పునరుత్పాదకశక్తి రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉండటం హర్షణీయం." - సుచిత్ర ఎల్లా, భారత్​ బయోటెక్​ ఎండీ

ఏపీ గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సదస్సులో సుచిత్ర ఎల్లా ప్రసంగం: మరోవైపు గత వారం ఏపీలో జరిగిన జీఐఎస్​ 2023 సదస్సులో భారత బయోటెక్​ ఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ..ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుందని హామీ ఇస్తూనే.. ఇక్కడి అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంతో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ చాలా అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీ గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సదస్సులో మరిన్ని విషయాలను ఆమె వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.