ETV Bharat / state

సమాజంలో అన్ని మతాలను గౌరవించాలి : తలసాని - క్రిస్​మస్​ కానుకలను పంపిణీ చేసిన తలసాని

రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అమీర్​పేట్​ డివిజన్​లోని వివేకానంద కమిటీహాల్​లో క్రిస్​మస్​ కానుకలను ఆయన అందజేశారు.

christmas gifts distribution by minister talasani srinivas yadav in ameerpet
సమాజంలో అన్ని మతాలను గౌరవించాలి : తలసాని
author img

By

Published : Dec 22, 2020, 1:08 PM IST

సమాజంలో అన్ని మతాలను గౌరవించాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్​మస్​ను పురస్కరింంచుకుని అమీర్​పేట్​ డివిజన్​ వివేకానంద కమిటీహాల్​లో పేద ప్రజలకు కానుకలను అందించారు.

రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఎదురైన కష్టాలను మరిచిపోయి క్రిస్​మస్​ను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్​పేట్​ మాజీ కార్పొరేటర్ శేషకుమారి, డిప్యూటీ కమిషనర్​ వంశీకృష్ణ, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అపస్మారక స్థితిలో మహిళ.. ఎమ్మెల్సీ కవిత మానవత్వం

సమాజంలో అన్ని మతాలను గౌరవించాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్​మస్​ను పురస్కరింంచుకుని అమీర్​పేట్​ డివిజన్​ వివేకానంద కమిటీహాల్​లో పేద ప్రజలకు కానుకలను అందించారు.

రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఎదురైన కష్టాలను మరిచిపోయి క్రిస్​మస్​ను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్​పేట్​ మాజీ కార్పొరేటర్ శేషకుమారి, డిప్యూటీ కమిషనర్​ వంశీకృష్ణ, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అపస్మారక స్థితిలో మహిళ.. ఎమ్మెల్సీ కవిత మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.