ETV Bharat / state

కందుకూరు బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శ.. ఇంటి పెద్దగా ఉంటానని హామీ - Chandrababu visited the Kandukur victims families

Chandrababu Consoled Families Of Kandukur Victims: ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఓదార్చారు. పార్టీ తరఫున ప్రకటించిన పరిహారం చెక్కులను వారి కుటుంబసభ్యులకు అందచేశారు. పార్టీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 29, 2022, 6:47 PM IST

కందుకూరు బాధిత కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు .. ఇంటి పెద్దగా ఉంటానని హామీ

Chandrababu Consoled Families Of Kandukur Victims: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ వస్తున్నా కార్యకర్తల భావోద్వేగంతో దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న తన కళ్ల ముందే జరిగిన ఘటన ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటా: బాధితుల కుటుంబ సభ్యుల ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేవని.. కానీ ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను చేసే ఉద్యమం రాష్ట్రం కోసమన్న ఆయన.. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారని అన్నారు. మృతుల కుటుంబాలు వేర్వేరు గ్రామాల్లో ఉన్నా చంద్రబాబు అందరి ఇళ్లకూ స్వయంగా వెళ్లి మృతుల భౌతికకాయాలు, చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తొలుత ఓబూరులో గడ్డం మధు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు వారికి పరిహారం చెక్కును అందచేశారు. అనంతరం గుర్రంవారిపాలెం వెళ్లి కాపుమాని రాజా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత కొండమురుసుపాలెంలో కలవపూరి యానాది కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

"నేను కూడా చాలా సార్లు రోడ్​షోలు చేశా. తర్వాత రాజశేఖర్​ రెడ్డి కూడా చేశాడు. ఇది బాధాకరమైన ఘటన. ఇలాంటివి జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు ఇరుకు రోడ్లలో మీటింగ్​లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నన్ను చూడని ప్రజలు ఎవరూ లేరు. కందుకూరులో ఎన్టీఆర్​ విగ్రహం వద్ద నేను మాత్రమే కాదు చాలా రాజకీయ పార్టీలు కూడా మీటింగులు అక్కడే పెట్టాయి" - చంద్రబాబు, టీడీపీ అధినేత

భోజన విరామం అనంతరం చంద్రబాబు గుండ్లపాలెం వెళ్లి ఊటుకూరి పురుషోత్తం కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం అమ్మవారిపాలెంలో మార్లపాటి చినకొండయ్య నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. అక్కడి నుంచి ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో దేవినేని రవీంద్రకు నివాళులర్పించిన చంద్రబాబు.. అక్కడి నుంచి వరిచేను సంఘం గ్రామంలో ఏకశిరి విజయ నివాసానికి వెళ్లారు. ఘటన పట్ల ఎవ్వరినీ నిందించను కానీ తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

మన జాగ్రత్తలు మనమే తీసుకుందాం: ప్రజలు భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి టీడీపీ సభలకు పెద్దఎత్తున వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే, దానిని విమర్శించాలనుకోవటం తప్పని సూచించారు. కందుకూరు ఎన్టీఆర్ సెంటర్​లో అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టాయని.. నిన్న జరిగిన సభే మొదటిది కాదని గుర్తు చేశారు. కావలి సభలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణుల్ని కోరారు. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మన జాగ్రత్తలు మనమే తీసుకుందామని దిశానిర్దేశం చేశారు.

"నేను కార్యకర్తలకు ఒకటే సూచిస్తున్న. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా.. మనమే జాగ్రత్తగా ఉంటూ మీటింగులు జరుపుకుందాం. స్వాతంత్య్రం కోసం అప్పుడు ఎలాగైతే ఉద్యమాలు చేశారో.. ఈరోజు రాష్ట్రాన్ని, తెలుగుజాతిని, ప్రజల భవిష్యత్తును కాపాడడానికి చేసే ఉద్యమం ఇది" - చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి: కందుకూరు ఘటన.. మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.23లక్షల ఆర్థిక సాయం..

కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్.. వారందరికీ RTPCR రిపోర్ట్ తప్పనిసరి

కందుకూరు బాధిత కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు .. ఇంటి పెద్దగా ఉంటానని హామీ

Chandrababu Consoled Families Of Kandukur Victims: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ వస్తున్నా కార్యకర్తల భావోద్వేగంతో దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న తన కళ్ల ముందే జరిగిన ఘటన ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటా: బాధితుల కుటుంబ సభ్యుల ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేవని.. కానీ ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను చేసే ఉద్యమం రాష్ట్రం కోసమన్న ఆయన.. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారని అన్నారు. మృతుల కుటుంబాలు వేర్వేరు గ్రామాల్లో ఉన్నా చంద్రబాబు అందరి ఇళ్లకూ స్వయంగా వెళ్లి మృతుల భౌతికకాయాలు, చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తొలుత ఓబూరులో గడ్డం మధు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు వారికి పరిహారం చెక్కును అందచేశారు. అనంతరం గుర్రంవారిపాలెం వెళ్లి కాపుమాని రాజా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత కొండమురుసుపాలెంలో కలవపూరి యానాది కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

"నేను కూడా చాలా సార్లు రోడ్​షోలు చేశా. తర్వాత రాజశేఖర్​ రెడ్డి కూడా చేశాడు. ఇది బాధాకరమైన ఘటన. ఇలాంటివి జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు ఇరుకు రోడ్లలో మీటింగ్​లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నన్ను చూడని ప్రజలు ఎవరూ లేరు. కందుకూరులో ఎన్టీఆర్​ విగ్రహం వద్ద నేను మాత్రమే కాదు చాలా రాజకీయ పార్టీలు కూడా మీటింగులు అక్కడే పెట్టాయి" - చంద్రబాబు, టీడీపీ అధినేత

భోజన విరామం అనంతరం చంద్రబాబు గుండ్లపాలెం వెళ్లి ఊటుకూరి పురుషోత్తం కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం అమ్మవారిపాలెంలో మార్లపాటి చినకొండయ్య నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. అక్కడి నుంచి ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో దేవినేని రవీంద్రకు నివాళులర్పించిన చంద్రబాబు.. అక్కడి నుంచి వరిచేను సంఘం గ్రామంలో ఏకశిరి విజయ నివాసానికి వెళ్లారు. ఘటన పట్ల ఎవ్వరినీ నిందించను కానీ తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

మన జాగ్రత్తలు మనమే తీసుకుందాం: ప్రజలు భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి టీడీపీ సభలకు పెద్దఎత్తున వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే, దానిని విమర్శించాలనుకోవటం తప్పని సూచించారు. కందుకూరు ఎన్టీఆర్ సెంటర్​లో అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టాయని.. నిన్న జరిగిన సభే మొదటిది కాదని గుర్తు చేశారు. కావలి సభలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణుల్ని కోరారు. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మన జాగ్రత్తలు మనమే తీసుకుందామని దిశానిర్దేశం చేశారు.

"నేను కార్యకర్తలకు ఒకటే సూచిస్తున్న. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా.. మనమే జాగ్రత్తగా ఉంటూ మీటింగులు జరుపుకుందాం. స్వాతంత్య్రం కోసం అప్పుడు ఎలాగైతే ఉద్యమాలు చేశారో.. ఈరోజు రాష్ట్రాన్ని, తెలుగుజాతిని, ప్రజల భవిష్యత్తును కాపాడడానికి చేసే ఉద్యమం ఇది" - చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి: కందుకూరు ఘటన.. మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.23లక్షల ఆర్థిక సాయం..

కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్.. వారందరికీ RTPCR రిపోర్ట్ తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.