ETV Bharat / state

కొనసాగుతున్న సీజీఎస్టీ సోదాలు.. 12 కోట్ల బకాయిలు గుర్తింపు.. - హైదరాబాద్​లో పలు సంస్థల కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల దాడులు

హైదరాబాద్​తో పాటు పలు నగరాల్లోని సంస్థల్లో  కేంద్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 12 కోట్ల మేర జీఎస్టీ, సేవా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు.

23 బృందాలుగా తనిఖీలు..
హైదరాబాద్​లో కేంద్ర జీఎస్టీ దాడులు..
author img

By

Published : Dec 20, 2019, 5:51 PM IST

Updated : Dec 20, 2019, 9:12 PM IST

కొనసాగుతున్న సీజీఎస్టీ సోదాలు.. 12 కోట్ల బకాయిలు గుర్తింపు..
హైదరాబాద్​తో పాటు విజయవాడలో కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం దాడులు కొనసాగుతున్నాయి. కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం అధికారులు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సికింద్రాబాద్‌ సీజీఎస్టీ కమిషన్‌రేట్ల అధికారులు, ఆడిట్‌ విభాగానికి చెందిన అధికారులతో కలిసి 23 ప్రత్యేక బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర జీఎస్టీ అధికారులు తెలిపారు.

లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంలో సోదాలు..

ఇప్పటి వరకు దాదాపు రూ.12 కోట్ల మేర ఆయా సంస్థలు జీఎస్టీ, సేవా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయ్యేసరికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లోని హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంపై దాడులు నిర్వహిస్తున్న అధికారులు ఆమె వద్ద రూ.25 లక్షల వరకు సేవా పన్ను బకాయి ఉన్నట్లు అంచనా వేశారు. ఓ మీడియా సంస్థలో తనిఖీలు చేసి.. సేవా పన్ను, జీఎస్టీ రెండు కలిపి దాదాపు మూడు కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.

ఫిట్​నెస్​ కేంద్రాల్లో 30 లక్షలు..

భారత్‌ నుంచి విదేశాలకు విద్యార్థులను పంపే ఓ కన్సల్టెన్సీపై హైదరాబాద్‌, విజయవాడల్లోని ప్రధాన కార్యాలయాలపై సోదాలు నిర్వహించి.. రెండు కోట్ల మేర జీఎస్టీ, సేవా పన్ను చెల్లించాల్సి ఉందని గుర్తించామన్నారు. హైదరాబాద్​లోని రెండు ఫిట్‌ నెస్‌ సెంటర్లలో 30లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తేల్చినట్లు తెలుస్తోంది. చిట్‌ఫండ్‌ కంపెనీలు, స్థిరాస్థి సంస్థల్లో కోట్లాది వరకు పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ సంస్థలు మొత్తం రూ.12 కోట్లు జీఎస్టీ, సేవా పన్నుల కింద చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించి.. ఆ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషిస్తున్నారు.

ఇవీ చూడండి: 'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'

కొనసాగుతున్న సీజీఎస్టీ సోదాలు.. 12 కోట్ల బకాయిలు గుర్తింపు..
హైదరాబాద్​తో పాటు విజయవాడలో కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం దాడులు కొనసాగుతున్నాయి. కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం అధికారులు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సికింద్రాబాద్‌ సీజీఎస్టీ కమిషన్‌రేట్ల అధికారులు, ఆడిట్‌ విభాగానికి చెందిన అధికారులతో కలిసి 23 ప్రత్యేక బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర జీఎస్టీ అధికారులు తెలిపారు.

లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంలో సోదాలు..

ఇప్పటి వరకు దాదాపు రూ.12 కోట్ల మేర ఆయా సంస్థలు జీఎస్టీ, సేవా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయ్యేసరికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లోని హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంపై దాడులు నిర్వహిస్తున్న అధికారులు ఆమె వద్ద రూ.25 లక్షల వరకు సేవా పన్ను బకాయి ఉన్నట్లు అంచనా వేశారు. ఓ మీడియా సంస్థలో తనిఖీలు చేసి.. సేవా పన్ను, జీఎస్టీ రెండు కలిపి దాదాపు మూడు కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.

ఫిట్​నెస్​ కేంద్రాల్లో 30 లక్షలు..

భారత్‌ నుంచి విదేశాలకు విద్యార్థులను పంపే ఓ కన్సల్టెన్సీపై హైదరాబాద్‌, విజయవాడల్లోని ప్రధాన కార్యాలయాలపై సోదాలు నిర్వహించి.. రెండు కోట్ల మేర జీఎస్టీ, సేవా పన్ను చెల్లించాల్సి ఉందని గుర్తించామన్నారు. హైదరాబాద్​లోని రెండు ఫిట్‌ నెస్‌ సెంటర్లలో 30లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తేల్చినట్లు తెలుస్తోంది. చిట్‌ఫండ్‌ కంపెనీలు, స్థిరాస్థి సంస్థల్లో కోట్లాది వరకు పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ సంస్థలు మొత్తం రూ.12 కోట్లు జీఎస్టీ, సేవా పన్నుల కింద చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించి.. ఆ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషిస్తున్నారు.

ఇవీ చూడండి: 'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'

Tg_hyd_50_20_CGST_spl_teams_raids_AV_3038066 Reporter: M.Tirupal Reddy dry () హైదరాబాద్ నగరంలో వివిధ సంస్థల కార్యాలయాలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుంచి నగర వ్యాప్తంగా మొత్తం 23 కేంద్ర జీఎస్టీ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్రా కంపెనీ లు, విద్యా సేవలు అందిస్తున్న సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీ లు , ఫిట్నెస్ సంస్థల కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర జీఎస్టీ అధికారులు వివరించారు. ఒక మీడియా సంస్థ తో పాటు సినిమా హీరోయిన్ ఇంటిపై కూడా సోదాలు చేస్తున్నట్లు కేంద్ర జిఎస్టీ నిఘా విభాగం అధికారులు తెలిపారు
Last Updated : Dec 20, 2019, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.