హైదరాబాద్ నగరంలో సగానికి పైగా బస్తీలు మాజీ మంత్రి వెంకటస్వామి వల్లే ఏర్పడ్డాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లేకపోతే చాలా బస్తీలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయేవని తెలిపారు. వెంకటస్వామి 6వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై కాకా విగ్రహానికి భాజపా నేత వివేక్తో కలిసి నివాళులు అర్పించారు.
తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజాసంఘాల నాయకులను, రాజకీయ పార్టీ నేతలను తెలంగాణ కోసం ఒప్పించారన్నారు. కార్మికులకు పింఛన్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారికి పీఎఫ్... సివిల్ సప్లయ్ మంత్రిగా అన్నపూర్ణ క్యాంటిన్ల ఏర్పాటు, పేదలకు గుడిసెలు ఇప్పించిన గొప్ప నేత ఆయన అని భాజపా నేత వివేక్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంపీలందరికీ దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలే..'