హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా నిలిపివేసిన ఎంఎంటీఎస్ రైళ్ల పునఃప్రారంభంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు అత్యంత చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయాలు కలుగుతాయని కిషన్ రెడ్డి.. ఓ ప్రకటనలో వివరించారు. కొవిడ్ నిబంధనలతో రైళ్లు నడుస్తాయని చెప్పారు.
ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిని మన్నించి ఎంఎంటీఎస్ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కి నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..