ETV Bharat / state

తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే మొదలైంది: కిషన్​రెడ్డి

author img

By

Published : Nov 11, 2022, 8:28 PM IST

Kishanreddy fires on KCR: తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్​ను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇచ్చిన హామీలపై అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని మండిపడ్డారు. మహిళా‌ గవర్నర్​ను తెరాస సర్కార్ పదే పదే అవమానించటాన్ని ఆయన ఖండించారు.

Kishanreddy
Kishanreddy

Kishanreddy fires on KCR: ప్రధాని నరేంద్రమోదీ రేపు మధ్యాహ్నం హైదరాబాద్​లో భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న స్వాగత సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రామగుండం యూరియా పరిశ్రమ ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడి నుంచే జాతీయ రహదారులు, రైల్వే పనులకు సంబంధించిన పనులను ప్రారంభిస్తారన్నారు.

తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్​ను వదిలే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలపై అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని మండిపడ్డారు. మహిళా‌ గవర్నర్​ను తెరాస సర్కార్ పదే పదే అవమానించటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ.. స్వయంగా పెట్రోలియం శాఖామంత్రి సీఎం కేసీఆర్​కు లేఖ రాశారన్నారు.

తెలంగాణ కేసీఆర్ రాజ్యం కాదు: దేశ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం విచారకరమని కిషన్​రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు కనీస మర్యాద ఇవ్వాలని సూచించారు. రామగుండం బంద్​కు పిలుపునిచ్చిన పార్టీలకు.. ప్రజలు ఎప్పుడో బంద్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే... తెలంగాణ సర్కార్ కాళేశ్వరం కట్టేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ప్రగతి భవన్​లో సిట్టయ్యిందని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాని రాష్ట్రానికి రావొద్దు అనడం సమంజసం కాదన్న ఆయన.. తెలంగాణను కేసీఆర్ రాజ్యంలా వ్యవహరిస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ నైతిక విలువల పట్ల ఎలాంటి ఆలోచన సీఎం కేసీఆర్​కు లేదని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

Kishanreddy fires on KCR: ప్రధాని నరేంద్రమోదీ రేపు మధ్యాహ్నం హైదరాబాద్​లో భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న స్వాగత సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రామగుండం యూరియా పరిశ్రమ ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడి నుంచే జాతీయ రహదారులు, రైల్వే పనులకు సంబంధించిన పనులను ప్రారంభిస్తారన్నారు.

తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్​ను వదిలే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలపై అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని మండిపడ్డారు. మహిళా‌ గవర్నర్​ను తెరాస సర్కార్ పదే పదే అవమానించటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ.. స్వయంగా పెట్రోలియం శాఖామంత్రి సీఎం కేసీఆర్​కు లేఖ రాశారన్నారు.

తెలంగాణ కేసీఆర్ రాజ్యం కాదు: దేశ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం విచారకరమని కిషన్​రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు కనీస మర్యాద ఇవ్వాలని సూచించారు. రామగుండం బంద్​కు పిలుపునిచ్చిన పార్టీలకు.. ప్రజలు ఎప్పుడో బంద్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే... తెలంగాణ సర్కార్ కాళేశ్వరం కట్టేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ప్రగతి భవన్​లో సిట్టయ్యిందని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాని రాష్ట్రానికి రావొద్దు అనడం సమంజసం కాదన్న ఆయన.. తెలంగాణను కేసీఆర్ రాజ్యంలా వ్యవహరిస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ నైతిక విలువల పట్ల ఎలాంటి ఆలోచన సీఎం కేసీఆర్​కు లేదని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.