ETV Bharat / state

ఆనందయ్య మందు.. హానికరం మాత్రం కాదు: ఆయుష్ కమిషనర్

author img

By

Published : May 24, 2021, 11:00 PM IST

ఏపీ, కృష్ణపట్నం ఆనందయ్య మందు.. ఆయుర్వేదం కానప్పటికీ, హానికరం మాత్రం కాదని ఆయుష్ రాష్ట్ర కమిషనర్ రాములు మరోసారి చేసిన ప్రకటన... అందరి దృష్టి భారతీయ వైద్య విధానాల వైపు మళ్లేలా చేసింది. సంప్రదాయ వైద్యాన్ని అనుసరించేవారు.. ఆయుర్వేదం, మూలిక వైద్యం, గృహ వైద్యం పట్ల ఆశాజనకంగా ఉన్నారు.

anandaiah-medicine
ఆనందయ్య మందు

ఏపీ, కృష్ణపట్నం ఆనందయ్య మందు.. 18 రకాల మూలిక మిశ్రమాలతో తయారైన గుణాత్మకమైన మందేననే ఆయుష్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. కానీ దీనికి శాస్త్ర ప్రామాణికత మాత్రం ఇంకా లేదు. 'ది సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చిఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్‌సెస్‌' పరిశీలనలో ఇది తేలనుంది.

ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు.. ఆనందయ్య ఉచిత మందును వాడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చాలా మందికి ఆయుష్ తాజా ప్రకటన మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. నాలుగైదు రోజుల్లో 'ది సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చిఇన్‌ ఆయుర్వదిక్‌ సైన్‌సెస్‌' ( సీసీఆర్‌ఏఎస్‌) ఆనందయ్య మందులో మూలిక గుణాలను విశ్లేషించి సమగ్ర నివేదికను ఇవ్వనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఆయుర్వేద కళాశాలలు, అందులోని అధ్యాపకులు, విద్యార్థుల సహకారం కూడా సీసీఆర్ఏఎస్ తీసుకుంటోంది.

ఇప్పటివరకు కృష్ణపట్నంలో జరిపిన పరిశీలన, ఆనందయ్య మందును వాడిన వారి అభిప్రాయలు, మందులో ఉన్న గుణాలను ఆయుష్ కమిషనర్.. సీఎం జగన్​కు తెలియజేశారు. సీసీఆర్‌ఏఎస్‌ వారు ఇచ్చే నివేదిక తరువాతే.. ఆనందయ్య మందు వాడకంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వనుందని రాములు వెల్లడించారు. అప్పటివరకు కృష్ణపట్నంలో ఆనందయ్యకు ఇస్తున్న భద్రత కొనసాగిస్తామని నెల్లూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు.

ఇదీ చదవండి: కరోనా పరీక్షలు మరింత పెంచాలి: సీఎం కేసీఆర్​

ఏపీ, కృష్ణపట్నం ఆనందయ్య మందు.. 18 రకాల మూలిక మిశ్రమాలతో తయారైన గుణాత్మకమైన మందేననే ఆయుష్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. కానీ దీనికి శాస్త్ర ప్రామాణికత మాత్రం ఇంకా లేదు. 'ది సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చిఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్‌సెస్‌' పరిశీలనలో ఇది తేలనుంది.

ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు.. ఆనందయ్య ఉచిత మందును వాడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చాలా మందికి ఆయుష్ తాజా ప్రకటన మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. నాలుగైదు రోజుల్లో 'ది సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చిఇన్‌ ఆయుర్వదిక్‌ సైన్‌సెస్‌' ( సీసీఆర్‌ఏఎస్‌) ఆనందయ్య మందులో మూలిక గుణాలను విశ్లేషించి సమగ్ర నివేదికను ఇవ్వనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఆయుర్వేద కళాశాలలు, అందులోని అధ్యాపకులు, విద్యార్థుల సహకారం కూడా సీసీఆర్ఏఎస్ తీసుకుంటోంది.

ఇప్పటివరకు కృష్ణపట్నంలో జరిపిన పరిశీలన, ఆనందయ్య మందును వాడిన వారి అభిప్రాయలు, మందులో ఉన్న గుణాలను ఆయుష్ కమిషనర్.. సీఎం జగన్​కు తెలియజేశారు. సీసీఆర్‌ఏఎస్‌ వారు ఇచ్చే నివేదిక తరువాతే.. ఆనందయ్య మందు వాడకంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వనుందని రాములు వెల్లడించారు. అప్పటివరకు కృష్ణపట్నంలో ఆనందయ్యకు ఇస్తున్న భద్రత కొనసాగిస్తామని నెల్లూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు.

ఇదీ చదవండి: కరోనా పరీక్షలు మరింత పెంచాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.