ETV Bharat / state

పాల పాకెట్ల కవర్లతో బస్ షెల్టర్ నిర్మాణం - పాల పాకెట్ల కవర్లతో బస్ షెల్టర్ నిర్మాణం

గ్రేటర్ పరిధిలో ఎక్కువ శాతం ప్రజలు పాకెట్ల పాలనే వాడుతుంటారు. పాలు వాడుకుని పాకెట్లను పడేస్తారు. వాటితో పనేముంది అనుకునేవారు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పనికిరావు అనుకున్నవే ఇప్పుడు సేదదీర్చబోతున్నాయి. పాలపాకెట్ల కవర్లతో బస్ షెల్టర్ నిర్మాణం... కాస్త విచిత్రంగా ఉన్నా త్వరలోనే ఇది నిజం కానుంది.

పాల పాకెట్ల కవర్లతో బస్ షెల్టర్ నిర్మాణం
author img

By

Published : Jul 17, 2019, 7:52 PM IST

పాల పాకెట్ల కవర్లతో బస్ షెల్టర్ నిర్మాణం

ప్లాస్టిక్​ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో నగరంలో మొట్ట మొదటిసారిగా బస్ షెల్టర్ నిర్మాణం అందుబాటులోకి రాబోతోంది. ఈ నిర్మాణానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా శ్రీకారం చుట్టునున్నాయి. కవాడీగూడ ప్రధాన రహదారిలో ఈ నిర్మాణం కొనసాగనుంది. వ్యర్థ పదార్థాలతో నిర్మించనున్న మొట్టమొదటి బస్ షెల్టర్​గా హైదరాబాద్ మహానగర చరిత్రలో ఇది నిలిచిపోనుంది. దీని నిర్మాణానికి ఎన్​టీపీసీ సహకారం అందిస్తున్నది.

ప్లాస్టిక్​తోనే నిర్మాణం

మెటల్ ఫ్రేమ్ మినహాయిస్తే... రూఫ్, సీలింగ్, వాల్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, రెయిలింగ్ ఇలా అన్నీ పునర్వినియోగ ప్లాస్టిక్​తోనే నిర్మించనున్నారు. ఈ పూర్తి యూనిట్​ను గుజరాత్‌ రాష్ట్రంలోని పునర్వినియోగ ప్లాస్టిక్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ తయారీ సంస్థలో చేస్తారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సుమారు రూ.7లక్షల వ్యయంతో బస్ షెల్టర్ నిర్మాణం చేపడుతున్నట్లు జీహెచ్​ఎంసీ వెస్ట్​జోన్​ కమిషనర్​ హరిచందన వెల్లడించారు.

25 ఏళ్ల వరకు చెక్కు చెదరని నిర్మాణం

ఈ నిర్మాణంలో ఐదు లక్షలకు పైగా వాడిపడేసిన పాల పాకెట్లను వినియోగించనున్నారు. 12 వందల కిలోల బరువు కల్గిన ఈ యూనిట్​కు మంటలు, నీరు, వేడిమి వల్ల ఎలాంటి ప్రమాదం లేదా నష్టం జరిగే అవకాశాలు ఉండవని నిర్మాణదారులు అంటున్నారు. దీని నిర్మాణంలో వినియోగించే వ్యర్థాలతో మనుషులకు పర్యవరణానికి ఎటువంటి హాని ఉండదంటున్నారు. సుమారు 25 యేళ్ల వరకు ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుందని హామీనిస్తున్నారు. షెల్టర్ పై భాగంలో ఒక కిలోవాట్ విద్యుత్ నిల్వ సామర్థ్యం కలిగిన సోలార్ పానెల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. షెల్టర్ ప్రకటన బోర్డు, లైటింగ్, చార్జింగ్ పాయింట్లకు అవసరమైన విద్యుత్ సరఫరా దీని ద్వారా అందుతుంది.
ప్లాస్టిక్ పునర్వినియోగంతో నిర్మించనున్న ఈ బస్ షెల్టర్ అందుబాటులోకి వస్తే... ఇటువంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టవచ్చని జీహెచ్​ఎంసీ యోచిస్తోంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం

పాల పాకెట్ల కవర్లతో బస్ షెల్టర్ నిర్మాణం

ప్లాస్టిక్​ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో నగరంలో మొట్ట మొదటిసారిగా బస్ షెల్టర్ నిర్మాణం అందుబాటులోకి రాబోతోంది. ఈ నిర్మాణానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా శ్రీకారం చుట్టునున్నాయి. కవాడీగూడ ప్రధాన రహదారిలో ఈ నిర్మాణం కొనసాగనుంది. వ్యర్థ పదార్థాలతో నిర్మించనున్న మొట్టమొదటి బస్ షెల్టర్​గా హైదరాబాద్ మహానగర చరిత్రలో ఇది నిలిచిపోనుంది. దీని నిర్మాణానికి ఎన్​టీపీసీ సహకారం అందిస్తున్నది.

ప్లాస్టిక్​తోనే నిర్మాణం

మెటల్ ఫ్రేమ్ మినహాయిస్తే... రూఫ్, సీలింగ్, వాల్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, రెయిలింగ్ ఇలా అన్నీ పునర్వినియోగ ప్లాస్టిక్​తోనే నిర్మించనున్నారు. ఈ పూర్తి యూనిట్​ను గుజరాత్‌ రాష్ట్రంలోని పునర్వినియోగ ప్లాస్టిక్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ తయారీ సంస్థలో చేస్తారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సుమారు రూ.7లక్షల వ్యయంతో బస్ షెల్టర్ నిర్మాణం చేపడుతున్నట్లు జీహెచ్​ఎంసీ వెస్ట్​జోన్​ కమిషనర్​ హరిచందన వెల్లడించారు.

25 ఏళ్ల వరకు చెక్కు చెదరని నిర్మాణం

ఈ నిర్మాణంలో ఐదు లక్షలకు పైగా వాడిపడేసిన పాల పాకెట్లను వినియోగించనున్నారు. 12 వందల కిలోల బరువు కల్గిన ఈ యూనిట్​కు మంటలు, నీరు, వేడిమి వల్ల ఎలాంటి ప్రమాదం లేదా నష్టం జరిగే అవకాశాలు ఉండవని నిర్మాణదారులు అంటున్నారు. దీని నిర్మాణంలో వినియోగించే వ్యర్థాలతో మనుషులకు పర్యవరణానికి ఎటువంటి హాని ఉండదంటున్నారు. సుమారు 25 యేళ్ల వరకు ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుందని హామీనిస్తున్నారు. షెల్టర్ పై భాగంలో ఒక కిలోవాట్ విద్యుత్ నిల్వ సామర్థ్యం కలిగిన సోలార్ పానెల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. షెల్టర్ ప్రకటన బోర్డు, లైటింగ్, చార్జింగ్ పాయింట్లకు అవసరమైన విద్యుత్ సరఫరా దీని ద్వారా అందుతుంది.
ప్లాస్టిక్ పునర్వినియోగంతో నిర్మించనున్న ఈ బస్ షెల్టర్ అందుబాటులోకి వస్తే... ఇటువంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టవచ్చని జీహెచ్​ఎంసీ యోచిస్తోంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం

సికింద్రాబాద్ యాంకర్ భర్త వేధింపులు తాళలేక ఒక మహిళ తన ఇద్దరు కొడుకుల తోపాటు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.అంజలి నిన్న చనిపోగా ఈరోజు కు చికిత్స పొందుతూ అతని చిన్న కుమారుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు అంజలి అక్క చెల్లెల రోదనలు మిన్నంటాయి ..అంజలి తమ్ముడు మాట్లాడుతూ అతను ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడని అక్కను హింసించే వాడని తెలిపారు.. పెళ్లయి పది సంవత్సరాల పైన అయిందని వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారని అన్నారు..తాగడానికి డబ్బుల కోసం ప్రతి నిత్యం తన అతను వేధించేవాడని ఆమె వేధింపులు తట్టుకోలేక తనకు ఎన్నోసార్లు చెప్పిందని అన్నారు..అతనికి పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..వారి కుటుంబ సభ్యులు కూడా అతను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండేవారని అన్నారు..ఇప్పుడు తన అక్కతో పాటు చిన్న కొడుకు కూడా మృతిచెందాడని వీరికి న్యాయం చేయాలని ఆయన కోరారు.. పెద్ద కొడుకు మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం తమని స్కూల్కు పంపించకుండా తన తల్లి కూడా స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నామని అన్నారు నిన్న కూల్ డ్రింక్ బాటిల్ లో విషం కలిపి ఇచ్చినట్లు తెలిపాడు గనుక విష0 ఇచ్చిన సంగతి గమనించి తాను వాంటింగ్ చేసుకున్నట్లు తెలిపాడు.. ..గత కొన్ని రోజుల క్రితమే ఇతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు..కేసు అయిన అనంతరం అతను ఇంటికి రావటం లేదని అన్నారు..వీరి కొడుకులు అమృత తేజ్ అనిరుద్ లో తల్లి అంజలితోపాటు ఉండేవారు..భర్త వేధింపులు ఎక్కువవడంతో ఏం చేయాలో పాలు పోక తన కొడుకులిద్దరికీ విషమిచ్చి తన అక్క అయిన అంజలి ఆత్మహత్యకు పాల్పడిందని బాధను వ్యక్తం చేశారు..బైట్1. రాజేష్ అంజలి తమ్ముడు 2.అంజలి తనయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.