ETV Bharat / state

'మండల కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలి'

author img

By

Published : Jun 19, 2020, 6:46 AM IST

జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలకు సూచించారు. జూన్​ 30 వరకు ఇంటింటికి మోదీ సందేశం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.

మండల కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలి
BJP Telangana State President Bandi sanjay Meeting with Party general secretaries on Yoga Day Celebrations

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న అన్ని మండల కేంద్రాలలో కొవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి యోగా కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశంలో నిర్ణయించారు.

కరోనా వ్యాప్తి నివారణ, నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసగా జూన్ 22న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసన తెలపాలని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, చారిత్రక నిర్ణయాలు, ఆత్మనిర్భర్ భారత్ అనే అంశాలపై ఇంటింటికి మోదీ సందేశం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జూన్ 30 వరకు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న అన్ని మండల కేంద్రాలలో కొవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి యోగా కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశంలో నిర్ణయించారు.

కరోనా వ్యాప్తి నివారణ, నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసగా జూన్ 22న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసన తెలపాలని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, చారిత్రక నిర్ణయాలు, ఆత్మనిర్భర్ భారత్ అనే అంశాలపై ఇంటింటికి మోదీ సందేశం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జూన్ 30 వరకు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.