ETV Bharat / state

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్​

author img

By

Published : Nov 30, 2020, 12:32 PM IST

మహంకాళి అమ్మవారిని బండి సంజయ్​ దర్శించుకున్నారు. భాగ్యనగర ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

bjp state president Bundi Sanjay visiting Mahankali temple, Secunderabad
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్​

భాగ్యనగర ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విజ్ఞప్తి చేశారు. కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని బండి సంజయ్​ సికింద్రాబాద్​ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఆలయంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం ప్రసిద్ధి గాంచిందని అన్నారు. హిందూ సమాజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవుతుందని హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కులాలు వర్గాల పేరుతో రాజకీయం చేసే వారు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రెండు సమాజం మరింత శక్తివంతంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని భాగ్య నగర చైతన్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

భాగ్యనగర ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విజ్ఞప్తి చేశారు. కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని బండి సంజయ్​ సికింద్రాబాద్​ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఆలయంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం ప్రసిద్ధి గాంచిందని అన్నారు. హిందూ సమాజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవుతుందని హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కులాలు వర్గాల పేరుతో రాజకీయం చేసే వారు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రెండు సమాజం మరింత శక్తివంతంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని భాగ్య నగర చైతన్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.