ETV Bharat / state

సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి: కె.లక్ష్మణ్​

author img

By

Published : Sep 11, 2020, 2:20 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి: కె.లక్ష్మణ్​
సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి: కె.లక్ష్మణ్​

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్​ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అశోక్​నగర్​లోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాశారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన లక్ష్మణ్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడ్​పల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడా అరెస్టు చేయడం దారుణమన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్​ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అశోక్​నగర్​లోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాశారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన లక్ష్మణ్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడ్​పల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడా అరెస్టు చేయడం దారుణమన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

ఇదీ చదవండి: పటాన్​చెరులో భాజపా నాయకుల ముందస్తు అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.